ఆకాశంలోకి దట్టమైన భారీ పొగలు: భయాందోళనలో విశాఖ వాసులు, ఇళ్ల నుంచి బయటకు
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు నగర వాసులను మరోసారి భయాందోళనలకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడం స్థానికంగా కలకలం రేపింది.
హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఎన్హెచ్యూను తెరిచేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా ఈ దట్టమైన పొగలు వచ్చాయి. ఒక్కసారిగా భారీ మొత్తంలో తెల్లని పొగలు ఆకాశంలోకి రావడంతో ఎన్ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం వాసులు భయాందోళనలకు గురయ్యారు.

అంతా ఇళ్ల నుంచి బయటికి వచ్చి మళ్లీ ఏం జరిగిందోనంటూ ఆందోళన చెందారు. అయితే, కొంత సేపటికి పొగ తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై హెచ్పీసీఎల్ యాజమాన్యం స్పందించింది.
Visakhapatnam: Thick smoke emanated from a Crude Distillation Unit plant at Hindusthan Petroleum Corp Ltd (HPCL) refinery, earlier today. As per HPCL PRO,"Due to a technical snag, the crude distillation unit plant restarted.The situation was immediately brought under control". pic.twitter.com/CJszGTc1HF
— ANI (@ANI) May 21, 2020
రిఫైనరీలో ఎన్హెచ్యూను తెరిచే క్రమంోల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గుర్తించి, వెంటనే పరిస్థితిని సరిచేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఎలాంటి పొగ రావడం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కాగా, ఇటీవల విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 200 మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దట్టమైన పొగలు రావడంతో విశాఖ వాసులను మరోసారి ఆందోళనకు గురిచేసింది.
Recommended Video
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications