విశాఖలో దారుణం: ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి, దర్యాప్తులో షాకింగ్ విషయాలు
విశాఖలో ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విశాఖ నగరం మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. అయితే వీరిని హతమార్చి, సజీవదహనం చేసినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నారు.

మంటల్లో సజీవ దహనం అయిన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు ..నలుగురు మృతి
మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్ లో ఎన్ఆర్ఐ కుటుంబం ఎనిమిది నెలలుగా నివసిస్తోంది . అయితే వారి ఇంటి నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటల ధాటికి నలుగురు సజీవ దహనం అయ్యారు అని తెలుస్తుంది. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదట దీనిని అగ్ని ప్రమాదంగా భావించినా , తర్వాత రక్తపు మరకలు ఉండటంతో పక్కాగా ప్లాన్ చేసి మరీ చేసిన హత్యలుగా అనుమానించారు.

ఎన్నారై కుటుంబం అనుమానాస్పద మృతిలో షాకింగ్ ట్విస్ట్ .. పెద్ద కుమారుడే హంతకుడు
ఇక ఈ ఘటనలో ఆసక్త్జికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత కొంత కాలంగా వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, వీరి కుమారులు దీపక్ , కశ్యప్ గా గుర్తించారు. వీరి పెద్ద కుమారుడు దీపక్ మిగతా వారిని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే సజీవ దహనం చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు .
Recommended Video

కుటుంబ సభ్యులపై పెద్ద కుమారుడు దాడి .. ఆపై సజీవ దహనం
ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు హత్య చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని మొదట భావించారు . కానీ సీసీటీవి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యులపై పెద్దకుమారుడు దీపక్ దాడి చేసినట్లుగా గుర్తించారు. ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసి, ఆపై దీపక్ సజీవదహనం చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపక్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని ఈ కేసుపై సి పి మనీష్ కుమార్ సిన్హా మీడియాతో వెల్లడించారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications