ఎన్కౌంటర్స్: గడ్చిరోలిలో ఐదుగురు మావోయిస్టులు మృతి, ములుగులో ఇద్దరు
వరంగల్: ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదరురుకాల్పులు జరిగాయి. మంగపేట అటవీ ప్రాంతంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు తారసపడటంతో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ముందుగా మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఎదురుకాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.
గడ్చిరోలిలో ఎదురుకాల్పులు: ఐదుగురు మావోలు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. కోస్మి-కిస్నేలి అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని గడ్చిరోలి ఎస్పీ తెలిపారు.
గడ్చిరోలి పోలీసు బలగానికి చెందిన సీ-60 కమాండోలు ధనోరా తాలూకాలో ఆదివారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో కమాండోలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే, మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియరాలేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications