న్యూజెర్సీలో తెలంగాణ నైట్
అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడియఫ్) న్యూజెర్సీలో ఇటీవల తెలంగాణ నైట్ ను నిర్వహించింది. అమెరికాలోని తెలంగాణకు చెందివవారందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యుయస్ఎ - టిడియఫ్ అధ్యక్షుడు మధు కె. రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ సాంస్కృతిక విశిష్టత గురించి ఆయన తన ప్రారంభోపన్యాసంలో వివరించారు. తెలంగాణలోనే అసలు సిసలైన తెలుగు భాష వాడుకలో ఉందని అంటూ ఆయన అందుకు ఉదాహరణలు ఇచ్చారు. ఆయన ప్రసంగానికి విశేష స్పందన లభించింది.
సాయంత్ర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. డాక్టర్ జిన్నా కార్యక్రమాల గురించి వివరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. మోనా నేరెవట్ల గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనిత గంగసాని చేసిన దశావతార శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను అలరించింది. ఆమె ఇటీవలే దక్షిణ బారత నృత్య రూపాల్లో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది.
రవి మేరెడ్డి అమెరికాలోని టిడియఫ్ కార్యకలాపాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అమెరికాలోని తెలంగాణవారికి ఆయన పిలుపునిచ్చారు.
చిన్నారుల, యువత సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం పెద్దవాళ్లు పాపులర్ ట్యూన్స్కు నాట్యం చేసి తాము ఆనందిస్తూ ఇతరులకు ఆనందాన్ని పంచారు. సుధాకర్ పైల్ల, మురళి చింతల్పాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సురేందర్ మద్ది కార్యక్రమాన్ని రికార్డు చేశారు.