తెలంగాణ సాధన కోసం

ప్రత్యేకంగా విద్యార్ధి మిత్రులను కోరేదేంటంటే, మీరు ఆవేశాలకు లోనై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, గాంధీ చూపిన బాటలో శాంతియుతంగా ఉద్యమం చేయాలి. తెలంగాణా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు విన్నవించేదేమంటే, మనం ఆవేశాలకు లోనుకాకుండా, మన పనులు మనం చేసుకుంటూనే ఉద్యమంలో శాంతియుతంగా పాల్గొనాలి. మన సీమాంధ్ర నాయకులను చూసి మనం నేర్చుకోవలిసింది ఎంతైనా ఉంది. వాళ్ళలో కొంత మంది నాయకులు మన తెలంగాణా రాకుండా ఒక సంవత్సరం అయితే ఆపగలిగారు. మరి మన తెలంగాణా నాయకులు అంతా కలిసి ఇప్పుడు తెలంగాణా తీసుకురావాలి. దీనికోసమని పార్టీలకు అతీతంగా అందరు కలిసి పని చేయవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా పాలక పార్టీ నాయకులఫై ఎక్కువ బాద్యత ఉంది.
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి - సీమాంధ్ర వాళ్ళు రాజీనామా చేసినప్పుడు ఎవరికో పేరు వస్తుందని లేదా ఏ పార్టీ వాళ్ళు మొదలు పెట్టారనే విషయాన్ని చూడకుండా అందరూ కలసి కట్టుగా రాజీనామాలు ఇచ్చారు. మరి మన వరకు వచ్చే వరకు ఎందుకు ఈ కుంటి సాకులు. మనకు సహనం ఎక్కువ కాబట్టి ఇన్నిరోజులు శ్రీకృష్ణ కమిటీని నమ్ముకొని ఉన్నాం, ఇంతలోపే జరగాల్సిన నష్టం జరిగింది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గుడ్డిగా నమ్మకుండా, మన జాగ్రత్తలో మనం ఉండటం శ్రేయస్కరం.
-గాజుల బుచ్చన్న, కాలిఫోర్నియా నుంచి












Click it and Unblock the Notifications