వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిలికానాంధ్ర 'మనబడి' కార్యక్రమం

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
డల్లాస్‌: సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ప్రవాసాంధ్ర చిన్నారుల కోసం నిర్వహించిన మనబడి కార్యక్రమం వైభవంగా జరిగింది. తూర్పు ప్లినో విలియం ఉన్నతపాఠశాల ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కారక్రమంలో దాదాపు 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయాలు, పొడుపుకథలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇర్వింగ్‌, కోపిల్‌, తూర్పు, పడమర ప్లినో కేంద్రాల్లో తెలుగు నేర్చుకుంటున్న చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

శంకరం మంచి వేదప్రవచనంతో ప్రారంభమైన కార్యక్రమానికి సిలికానాంధ్ర అధ్యక్షులు, మనబడి డీన్‌ చమర్తి రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిలికానాంధ్ర కోశాధికారి తూములూరి శంకర్‌, డాలస్‌ నగర మనబడి సమన్వయకర్త కళ్యాణి సిద్దార్థ, భాస్కర్‌ రాయవరం, యువ రేడియో సారధి చేకూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కర్రి శ్రీవైష్ణవి, బాలాంత్రపు శృతి, శ్రీకర్‌ పమిడిముక్కల, వినతి పోలంరాజు, శృతి బొప్పన, రుద్ర వజ్జల ప్రధాన సంధానకర్తలుగా వ్యవహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X