వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ9పై తెలంగాణ ఎన్నారైల ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

TV 9
తెలుగు న్యూస్ చానెల్ టీవీ9 ప్రసారం చేసిన వార్తను అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు వ్యతిరేకించారు. ఈ మేరకు వారు టీవీ9కు ఓ లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండకు చెందిన చాకలి శ్రీనివాస్ తెలంగాణ కోసం చనిపోలేదని, కుటుంబ తగాదాల వల్ల మరణించాడని టీవీ9 తప్పుడు వార్తను ప్రసారం చేసిందని వారన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ఉంటున్న జగదీష్ బొందుగుల, విజయ కృష్ణ చాట్ల, వేణు నక్షత్రం, రవి పల్లా, గోపాల్ పిన్నమనేని, రఘు ఆ లేఖ రాశారు.

కిషన్ రెడ్డి, కుమారస్వామి తదితరుల సమక్షంలో ఆర్డీవో చాకలి శ్రీనివాస్ మరణ వాంగ్మూలం తీసుకున్నారని, తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ ఆ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడని వారు తెలిపారు. ప్రజల సెంటిమెంటును దెబ్బ తీయకూడదని వారు టీవీ9కు సూచించారు. దాన్ని సవరించకోకపోతే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X