గ్రేటర్ బోస్టన్ లో గ్రేటెస్ట్ ఉగాది వేడుకలు

ఏడు గంటల పాటు సాగిన సంబరాలకు అమరవాది కళ్యాణ్, చలుపాడి భావన వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సుమారు 200 మంది చిన్నారులు, యువతీయువకులు తమ ప్రతిభాపాటవాలు, వేమన పద్యాలు, సంగీత, సాహిత్య, సాంస్క్రతిక, న్రత్య, గాన ప్రదర్శనలతో ప్రవాసాంధ్రులను ఆకట్టుకున్నారు. పీవీఆర్ నరసింహారావు సిద్ధాంతి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. నూతన అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి ప్రవాసాంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది బోస్టన్ తెలుగు సంఘ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రముఖ తెలుగు సాహితీవేత్త, దర్శకుడు, గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 'నవ్వులపువ్వులు', పార్ధసారధి, సౌజన్యల సంగీత ప్రదర్శన వేడుకల్లో ప్రధానాకర్షణగా నిలిచాయి. బోస్టన్ తెలుగు సంఘ కార్యవర్గ, ట్రస్టీ బోర్డు సభ్యులు కళాకారులు, అతిధులు, వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, జ్ఞాపికలను బహుకరించారు. 'జనగణమన...' గీతాలాపనతో కార్యక్రమాలను ముగించారు.












Click it and Unblock the Notifications