ఎన్నారైల క్రికెట్ క్రీడా సౌరభం

శనివారం సాయంత్రం మేరియాట్ హోటల్లో జరిగిన విందులో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వివిధం ప్రాంతాల నుంచి వచ్చిన ఆటా కార్యవర్గ సభ్యులను, ఇతర కమిటీ సభ్యులను కులుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా, కార్యదర్శి రామ్మోహన్ కొండ, కార్యవర్గ సభ్యులు పర్మేష్ భీంరెడ్డి, సుధాకర్ పెర్మారి, బలవంత్ కొమ్మిడి, సురేష్ జిల్లా, వినోద్ కోడూరు, భువనేష్ బూజల, రాజేష్ మాదిరెడ్డి పాల్గొన్నారు.
ఆదివారం జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచులో చాలెంజర్ టీమ్ ఛాంపియన్షిప్ దక్కించుకుంది. చేజ్ ఎలెవన్ టీం ద్వితీయ స్థానం దక్కించుకుంది. మొదటి స్థానం దక్కించుకున్న జట్టుకు డాక్టర్ జిన్నా, రెండో స్థానం దక్కించుకున్న జట్టుకు స్థానిక ప్రముఖ హార్జ్ సర్జన్ చంద్రశేఖర రెడ్డి బీసం ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఆటా ప్రాంతీయ సమన్వయకర్తలు ఉదయ్ కిరణ్ కొమ్మిరెడ్డి, మాధవ మోసర్ల ఆధ్వర్యంలో స్థానిక ఆటా బోర్డు సభ్యుడు పర్మేష్ భీంరెడ్డి సూచనలతో విజయవంతంగా నిర్వహించారు.
తమకు సహాయసహకారాలు అందించిన ప్రశాంత్ గుడుగుంట్ల, కిరణ్ ఆలా, శ్రీవివాస్ కేశవరపు, శ్రీధర్ బొల్లెద్దుల, కమల్ నెల్లుట్లలకు ఉదయ్, మాధవ్ కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన వెంకటరావు మదిపగాడను జిన్నా ప్రత్యేకంగా అభినందించారు.












Click it and Unblock the Notifications