ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

USA
అవినీతికి వ్యతిరేకంగా జన్‌ లోక్‌పాల్ బిల్లుని ప్రవేశపెట్టాలని అన్న్నహజారే చేసిన దీక్షకు మద్దతు ఇవ్వాలని మొదటిసారిగా గతవారం అమెరికాలోని హౌస్టన్ లో ఫిఫ్త్ పిల్లర్ సంస్థకు చెందిన తెలుగు ఎన్నారైలు ఒక రోజు దీక్ష చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిమాణాల తరువాత ప్రభుత్వం ఈ బిల్లుని ప్రేవేశపెట్టాలనుకోవడంపై ఫిఫ్త్ పిల్లర్ హౌస్టన్ శాఖా అధ్యకషకుడు రాఘవ సోలిపురం ఆధ్వర్యం లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో తమసంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భం లో ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే తప్పకుండా ప్రజలజీవితల్లో వెలుగులు చూడవచాని దానికి నిదర్శనంగా ఈ కొవ్వోతులతో సంఘీభావ ర్యాలీని నిర్వహించామని తెలిపారు.

హౌస్టన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సంతకాల సేకరణలో భాగంగా దాదాపు ౩౦౦ మంది విద్యార్థులు లోక్‌పాల్ బిల్లును పటిష్టపరచడానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు .ఫిఫ్త్ పిల్లర్ తరఫున అమెరికాలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల లోని భారతీయ విద్యార్థుల మద్దతు ని కూడగడుతామని ఈ బిల్లు కార్యరూపం దాల్చేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బిల్లు గురించి ప్రవీణ్ పోతినేని మాట్లాడుతూ ఈ బిల్లుపై ప్రజలకు ఇంకా చాల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .త్వరలో ఫిఫ్త్పిల్లర్ ఆ పని చేపడుతుందని తద్వారా బిల్లుపై ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తే ప్రజలమద్దతు ఇంకా చాల పెరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు.

యువత ఇంకా పెద్దసంఖ్యలో ఇందులో పాలు పంచుకుంటే తప్ప మనదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలపలేమన్నారు. ప్రపంచకప్‌లో మనదేశం నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది గానీ అవినీతిరహిత దేశాల్లో మనదేశం 87 వ స్థానం లో ఉందన్నారు. అందులో మనదేశం నెంబర్ వన్ స్థానం ఆక్రమించాలంటే యువత పెద్దసంఖ్యలో భాగ్యస్వామ్యులవ్వాలని సందీప్ దాడి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+