వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో 4గురు తెలుగు విద్యార్థుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు విద్యార్థులు అసువులు బాశారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయీ మిసోరి ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన నలుగురు విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. వీరంతా సెయిట్ లూయిలోని రోలా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థులను సృజన్ రెడ్డి, ధీరజ్, శ్రీకాంత్, శ్రీహర్షలుగా గుర్తించారు. బొట్టు మురళి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారును మురళి నడిపినట్లు సమాచారం. సృజన్ రెడ్డిది కరీంనగర్ జిల్లా కాగా, శ్రీహర్షది విశాఖపట్నం జిల్లా అని తెలుస్తోంది. ధీరజ్, శ్రీకాంత్‌లది హైదరాబాద్ అని సమాచారం. మురళి కాణిపాకానికి చెందినవాడని అంటున్నారు.

English summary
Four Telugu students were dead in USA in a road accident and a student is critically injured. This accident occurred as their car collided with divider.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X