తెలంగాణ కోసం ఎన్నారైల ప్రదర్శన

NRI
పీపుల్ ఫర్ లోక్ సత్తా, ఎన్నారైల ఆధ్వర్యంలో లాస్ ఏంజలీస్‌లోని తెలుగువారందరూ తెలంగాణ సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని భారత ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. శనివారం నవంబర్ 19వ తేదీ మద్యాహ్నం 12 గంటలకు లాస్ ఏంజలీస్‌లోని ఎన్నారైలు అధికంగా వుండే అర్టీసియా ప్రాంతంలో ప్రదర్శన నిర్వహిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సమస్యకు పరిష్కరారం కాక గత రెండు సంవత్స్తారాలుగా ప్రాంతీయ విభేదాలు పెరగటం, రాష్ట్ర అభివృద్ది కుంటుపడటం, సకల జనుల సమ్మె, ఆత్మహత్యలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు గురికావటం పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినా అధికార పక్షం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమస్యని పరిష్కరించే దిశగా స్పష్టమైన అడుగులు వేయటం లేదని ఎన్నారైలు విమర్శించారు. ఈ సమస్యతో రాష్ట్రంలో పరిపాలన కూడా కుంటుపడిపోయిందని వారు అభిప్రాయపడ్డారు.

2009 డిసెంబర్ 9న, 23న పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలని తప్పుదోవ పట్టించినట్లు కాకుండా, అందరికి న్యాయం జరిగే పరిష్కారం చూపించి, దాని మీద గట్టిగా నిలబడాలని లాస్ ఏంజలీస్‌లోని తెలుగువారు కోరుతున్నారు. ప్రభుత్వం వారి తీర్పుని ప్రకటించేటప్పుడు దాని వెనక వున్న హేతుబద్ధమైన ఆలోచన, ఐక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కలిగిన, అలాగే విడిపోతే సీమాంద్ర ప్రజలకు కలిగే సాధకబాధకలు, కష్టనష్టాలేవి అని అన్నీ ప్రాంతాల వారికి అర్ధమయ్యేట్టు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+