అగ్ని ప్రమాద బాధితులకు ఆటా అండ
సమాచారం అందిన వెంటనే ఆటా ట్రస్టీలు బల్వంత్ రెడ్డి, శ్రీనివాస జిల్లా, తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన తెలంగాణ కుటుంబాలను వారు పరామర్శించారు. ఈ భవనం దగ్ధం వల్ల నష్టపోయిన 52 కుటుంబాల్లో 90 శాతం తెలుగువారికి సంబంధించినవే.
అగ్నిప్రమాద నష్టం విపరీతంగా ఉందని ఆటా తెలిపింది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియడం లేదు. దానిపై ఇంకా దర్యాప్తు సాగుతోంది. అదృష్టవశాత్తు అపార్టుమెంటులో నివసిస్తున్నవారిని సురక్షితంగా బయటకు తేగలిగారు. అయితే, ఫర్నీచర్, బంగారు, వస్త్రాలు, పాస్పోర్టులు, వీసాలు, వాహన రిజిష్టేషన్ వంటి పత్రాలన్నీ ప్రమాదంలో కాలిపోయాయి.
బాధిత తెలుగు కుటుంబాలకు సహాయం అందిస్తూ వారి పునరావాసానికి బల్వంత్ రెడ్డి, శ్రీనివాస్ జిల్లా నేతృత్వంలో ఆటా ప్రతినిధులు చర్యలు చేపట్టారు. బాధితులకు ఆటా నుంచి తగిన సహాయం అందిస్తామని బల్వంత్ రెడ్డి చెప్పారు.