అమెరికా: ఇద్దరు పూజారుల మృతి
రంజిత్ సింగ్ తన కుమారుడిని చూడడానికి దీపావళికి ఇక్కడికి రావాలని అనుకున్నాడు. తాను కాల్పుల సంఘటనను టీవీలో చూశానని, అయితే అందులో తన తండ్రి ఉంటాడని అనుకోలేదని, ఆదివారాలు మాత్రమే తన తండ్రి గురుద్వారాకు వెళ్తారని, తనకు ఉదయమే తన తండ్రి మరణవార్త తెలిసిందని గుర్వీందర్ చెప్పినట్లు జాతీయ మీడియా రాసింది. అతను తండ్రిని ఫొటోల్లోనే చూశాడు.
రంజిత్ సింగ్ తమ్ముడు సీతా సింగ్ ఫిబ్రవరిలో అమెరికా వెళ్లాడు. సీతా సింగ్కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆదివారంనాడు భార్య సురీందర్ కౌర్ సీతా సింగ్తో మాట్లాడింది. అమెరికాలో తన పని పట్ల సంతృప్తిగా ఉందని చెప్పాడని ఆమె చెప్పింది.
భారత ప్రభుత్వం గానీ అమెరికా ప్రభుత్వం గానీ తమతో మాట్లాడలేదని, మరణాలను నిర్ధారించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. అమెరికాలోని తమ బంధువులు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు.