నోట్లో తుపాకితో కాల్పులు: యుఎస్లో కరీంనగర్ వాసి మృతి
ఆచూకీ లభించక పోవడంతో ఆమె తాము నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్కు వెళ్లి చూసింది. అక్కడ వెంకట రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంకట రెడ్డి నోట్లో కాల్పులు జరిపి 800 డాల్రు ఎత్తుకు వెళ్లినట్లుగా భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక అనంతరమే అసలు విషయం తేలనుంది. పోస్టు మార్టం నివేదిక కోసం రెండు రోజులు ఆగవల్సి ఉంటుంది. వెంకట రెడ్డి తన భార్య, కుమారుడితో కలిసి అక్కడే స్థిరపడ్డాడు.
స్నేహితులతో కలిసి సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. రోజూ రాత్రి పది గంటలకే వచ్చె వెంకట రెడ్డి రెండు రోజుల క్రితం అంటే శనివారం రాత్రి 1 అయినా రాలేదు. దీంతో భార్య కవిత తెలిసిన వారితో కలిసి సూపర్ మార్కెట్కు వెళ్లి చూడగా వెంకట రెడ్డి చనిపోయి కనిపించాడు. అమెరికా మగ్గింగ్ కల్చర్కు అతను బలై ఉంటారని భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే ఏం జరిగిందో తెలియనుంది.