వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో తెలంగాణపై చర్చ

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు లండన్‌లో తెలంగాణ చర్చా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జెఎసి హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ ఎ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డాక్టర్ శ్రీధర్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్రను కొనియాడారు. అన్ని తెలంగాణ సంస్థలు, సమన్వయం, సహకారాలతో, ఐక్యతతో తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేయాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడు ఎన్నారైలు వచ్చి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు. పరకాల ఉప ఎన్నికలో తెలంగాణవాదులకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కూడా మాట్లాడారు. ఉద్యమంలో పాల్గొన్నవారికే కష్టాలు, బాధలు, విమర్శలు అని ఆయన అన్నారు. వాటిని ఓర్పు, సహనంతో తట్టుకోవాలని ఆయన సూచించారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం కార్యక్రమాలను, భవిష్యత్తు కార్యాచరణను శ్రీధర్ పవర్ ప్లే ప్రజెంటేషన్ ద్వారా వివరించిట్లు తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధి గంప వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు పి. వెంకట్, వేణదు అంకం, తుకారాం, మధు, వెంకమల్ల వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
TeNF London chaps conducted Telangana Charcha Vedhika on 26th May Sunday at Central London. Chief Guest Dr.A Sridhar (T- JAC chairman Hyderabad) from hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X