రజత్ గుప్తాకు రెండేళ్లు జైలు

63 ఏళ్ల గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష, 5 మిలియన్ల అమెరికా డాలర్ల జరిమానాను విధిస్తున్నట్లు అణెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి జెడ్ రాకోఫ్ చెప్పారు. గత 18 నెలలు తనకు ఎంతో సవాల్తో కూడిన సమయమని రజత్ గుప్తా అన్నారు. తన మిత్రులపై, తన కుటుంబంపై, తనకు ఇష్టమైన సంస్థలపై ఈ సంఘటన వేసిన ప్రభావానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, జీవిత కాలం పాటు నిర్మించుకుంటూ వచ్చిన ప్రతిష్ట దెబ్బ తిన్నదని, ఈ తీర్పు ఎంతో బాధాకరమైందని ఆయన అన్నారు.
మాన్హట్టన్లోని ఫెడరల్ కోర్టు ఆరు సందర్భాల్లో నాలుగు సందర్భాల్లో రజత్ గుప్తాను దోషిగా తేల్చింది. ఈ కేసులో ఇప్పటికే హెడ్జే ఫండ్ వ్యవస్థాపకుడు రాజ్ రాజరత్నం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మాజీ మెక్కెన్సీ అధిపతిపై భరారా ఇన్సైడర్ ట్రేడింగ్పై ఆరోపణలు చేసిన ఏడాది తర్వాత రజత్ గుప్తాకు జైలు శిక్ష పడింది.
తనపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన తర్వాత రజత్ గుప్తా ఎఫ్బిఐ ముందు లొంగిపోయారు. గుప్తా గోల్డ్మాన్ సాచ్స్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ బోర్డు సీట్లను సాధించే స్థాయికి ఎదిగారు. హైదరాబాదులోని బిజినెస్ స్కూల్ సహ వ్యవస్థాపకుడు కూడా. బిల్, మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ సలహాదారుగా కూడా పనిచేసారు. అమెరికన్ ఎయిర్లైన్స్ మాతృసంస్థ ఎఎంఆర్ డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశారు.












Click it and Unblock the Notifications