చికాగోలో ఉగాది సంబరాలు
సంస్థ నలుబది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 14వ తేదీన సంగీత, నృత్య కార్యక్రమాలను ప్రత్యేకంగా, ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉగాది, శ్రీరామనవమి సంబరాల్లో భాగంగా సాంస్కృతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు వక్తలుగా పదమ్, కిరణ్ అబ్బరాజు, మణి తెల్లప్రగడ వ్యవహరించారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముడి ప్రత్యేకతలు తెలిపే పాటలతో ఆడిపాడారు. కళాకారులు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ, ఏకీకరణ, జానపద కళ ప్రత్యేక నృత్యాలను పిల్లలు, పెద్దలు చేశారు. సోనియా, లోప, అపరూ నృత్యాలను రూపొందించారు.
సంస్థ సాంస్కృతిక కార్యదర్శి సుజాత అప్పలనేని, మాలతీ దామరాజు, శిరీష్ కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషి చేశారు. అంజి కందిమళ్ల, నరేందర్ చేమర్ల, ప్రదీప్ కందిమళ్ల, రమేష్ గారపత్య, సత్యనారాయణ కొండపాలి, శ్రీనివాస్ పెదమల్లు,త సామ రామిరెడ్డి, మూర్తి పీసపాటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి సేవలందించారు. అమెరికా తెలుగు సంస్థ కార్యనిర్వాహకులు కరుణాకర్ మాధవరం, సత్యనారాయణ కందిమళ్ల అట్లాంటాలో జూలై 6,7,8 తేదీల్లో నిర్వహించే తెలుగు సమ్మేళనం గురించి వివరించారు. చివరగా నిర్వహించిన అంత్యాక్షరి అందరినీ ఆకట్టుకుంది. అంజి కందిమళ్ల అందరికీ ధన్యవాదాలు తెలిపారు.