అమెరికాలో వరంగల్వాసి హత్య
తానా సహాయంతో ఆయన మృత దేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరంగల్ నగరం ఏకశిలానగర్ ప్రాంతానికి చెందిన కిస్మత్ దాస్ మూడేళ్ల కింద అమెరికాకు వెళ్లారు. అక్కడ న్యూజెర్సీ, పీల్స్బర్గ్లోని ఓ గ్యాస్ స్టేషన్లో పని చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాస్ విధి నిర్వహణలో ఉండగా, కొందరు అగంతుకులు ఆయనపై కాల్పులు జరిపారు. గాయపడిన దాస్ను పెన్సిల్వేనియా బెత్లెహేంలోని సెయింట్ ల్యూక్ హాస్పిటల్లో చేర్చారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దాస్ శనివారం సాయంత్రం మృతి చెందారు.
కిస్మత్దాస్కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదట ఒంటరిగా అమెరికాకు వెళ్లిన దాస్ రెండేళ్ల కిందట భార్యను కూడా తీసుకువెళ్లారు. వారి కుమారులు వరంగల్లోనే ఉంటున్నారు. వారిని పెద్ద చదువులు చదివించాలన్న ఆకాంక్షతో దాస్ వరంగల్లో కొంత కాలం చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. అవి కలిసి రాకపోగా అప్పులపాలయ్యారు. దీంతో అష్టకష్టాలు పడి అమెరికాకు వెళ్లారు. అక్కడ గ్యాస్ స్టేషన్లో పని చేస్తూ సంపాదించిన డబ్బును నెలనెలా కుమారులకు పంపిస్తున్నారు. భార్య వరలక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది.