వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల పాదయాత్రకు ఎన్నారైల మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
లాస్ ఎంజెలెస్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రకు అమెరికాలోని ఎన్నారైలు మద్దతు తెలిపారు. గత గురువారంనాటికి షర్మిల పాదయాత్ర చేపట్టి 50 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా వైయస్ ఫాన్స్ క్లబ్ అమెరికా అధ్యక్షుడు వీరా రెడ్డి నంద్యాల అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో ఎన్ఎజడ్8 సినిమా థియేటర్లలో రాజకీయ వాణిజ్య ప్రకటనను ప్రసారం చేయించారు.

షర్మిల పాదయాత్రకు సంఘీభావంగా ఆయన ఆ పనిచేశారు. షర్మిల పాదయాత్ర అక్టోబర్ 18వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభమైంది. వీరారెడ్డి నంద్యాల విడుదల చేసిన వాణిజ్య ప్రకటన డిసెంబర్ 3వ తేదీన ప్రసారమైంది.

షర్మిల పాదయాత్రను సాహసంతో కూడిన చర్యగా ఆయన అభివర్ణించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని షర్మిల గుర్తుకు తెస్తున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందుకు పూనుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందం కారణంగానే చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించడం లేదని ఆయన విమర్శించారు. మరో ప్రజా ప్రస్థానం పూర్తయ్యే వరకు ప్రసారమయ్యే షర్మిల పాదయాత్ర వాణిజ్య ప్రకటనకు మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.

English summary
SR Congress party leader YS Sharmila, who embarked on ‘Maro Praja Prasthanam’ padayatra on October 18 from YSR Ghat in Idupulapaya in Kadapa district, completed 50 days of her padayatra on Thursday,in Mahabubnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X