గ్యాంగ్ రేప్ విక్టిమ్కు లండన్లో నివాళి
లండన్లోని టవిస్టాక్ స్క్వేర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎన్నారైలు ప్రదర్శన నిర్వహించారు. ప్రవాసి భారతి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. వందలాది మంది ఎన్నారైలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గుమికూడి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బాధితురాలి మృతికి సంతాపసూచకంగా కొద్దిన నిమిషాలు మౌనం పాటించారు.
గ్యాంగ్ రేప్నకు నిరసనగా సేకరించిన సంతకాలతో ఓ వినతిపత్రాన్ని భారత కమిషన్కు సమర్పించారు. రేపిస్టులను శిక్షించడానికి పకడ్బందీ చట్టం చేయాలని వారు కోరారు. లైంగిక దాడుల కేసుల విచారణ వేగవంతంగా జరగడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ప్రవాసి భారతి తరఫున నాగేందర్ చిందం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో మరణించిన విషయె తెలిసిందే. ఆ సంఘటన విదేశాల్లోని ఎన్నారైలను విపరీతంగా చలింపజేసింది.