విద్యార్థులకు ఎన్నారైల నోట్ బుక్స్

మెదక్ జిల్లా కౌడిపల్లి మడలం పూజాబాద్ గ్రామంలో ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ దేశంలో ఉన్నా తమ మాతృభూమిని మరిచిపోకుండా తమ మమకారాన్ని చాటుతున్నారని, అది తెలంగాణ గొప్పదనమని నందిని సిధారెడ్డి అన్నారు.
ఇలా అందరూ పరస్పరం సహకరించుకుని విద్యారంగంలో ఉన్నతస్థాయికి చేరి ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడాలని ఆయన సూచించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకుడు రంగాచారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటాలని ఆయన అన్నారు.
జెఎన్టియు హైదరాబాద్ జెఎసి అధికార ప్రతినిధి తాళ్లపల్లి సురేందర్ కూడా మాట్లాడారు. విద్య ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ వెంకటకృష్ణయ్య, ప్రసాదరావు, వెంకటేష్, నవీన్, దాస్, అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications