NRI News: ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడు మృతి..
ఇండియా నుంచి చాలా మంది ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు విధి ఆడే వింత నాటకంలో చనిపోతుంటారు. తాజాగా
ఆస్ట్రేలియాలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా దాతలను ఓ ఎన్నారై భార్య అర్థిస్తుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో సోమవారం రాత్రి 7.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఎన్నారై ఖుష్దీప్ సింగ్ ఏదో పని కారులో వెళ్తున్నారు.
అతడు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో అతని కారు పల్టీలు కొట్టుకుంటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఖుష్ దీప్ సింగ్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే అక్కడి చేరుకున్న మెల్ బోర్న్ పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. పంజాబ్ కు చెందిన ఖుష్ దీప్ సింగ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కు ఉపాధి కోసం వెళ్లారు.

అతను అక్కడ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సంవత్సరం క్రితం అతని భార్య జప్ నీత్ కౌర్ మెల్ బోర్న్ వెళ్లింది. పై చదువుల కోసం ఆమె మెల్ బోర్న్ వెళ్లింది. అయితే తాజాగా భర్త ఖుష్ దీప్ చనిపోవడంతో ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదు. తమకు ఇండియాలో ఆస్తులు ఏం లేవని.. తన భర్త మృతదేహాన్ని భారత్ కు తీసుకెళ్లేందుకు సహాయం చేయాలని ఆమె దాతలను అర్థించారు. దీనికోసం 'గోఫండ్మీ' పేజీ క్రియేట్ చేశారు. దాని ద్వారా విరాలాలు సేకరిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలో గతంలో కూడా జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అక్కడ ప్రమాదవశాత్తు చనిపోతుంటారు. వారి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడానికి మృతుల కుటుంబాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే విదేశాల్లో చినిపోయిన వారిని వెంటనే ఇండియాకు తీసుకొచ్చేందుకు ఓ యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications