థాయిలాండ్లో హైదరాబాద్ యువ జంట మృతి (ఫోటో)
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన యువ దంపతులు థాయిలాండ్లో మృత్యువాత పడ్డారు. విహార యాత్రకు వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదం నింపారు. నగరానికి చెందిన పారిశ్రామిక వేత్త (సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) యశ్ అగర్వాల్ (27), పంకూరి మిఠల్ (26) దంపతులు.
ఈ నెల 2న వీరిద్దరు విహార యాత్రకు బ్యాంకాక్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం థాయిలాండ్లోని పాపులర్ బీచ్లలో ఒకటైన ఓ నాంగ్ బీచ్కి వెళ్లారు. తుఫాను వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా అగర్వాల్ దంపతులు బోట్లో సముద్రంలోనికి వెళ్లారు.

వాతావరణ పరిస్దితి బాగా లేకపోవడంతో బోటును వెనక్కి మళ్లించారు. తీరానికి కొద్ది దూరంలో ఉండగా బోటు తిరగడబడడంతో యువ జంట మునిగింది. ఓ గంట తర్వాత ఇద్దరి మృతదేహాలు నీటితో తేలుతూ కనిపించాయి.
ఒక్కగానొక్క కుమారుడు, కోడలు మృత్యువాతపడడంతో మహేంద్ర అగర్వాల్ నివాసంలో విషాదం నెలకొంది. వివాహమై ఏడాదిన్నర గడవకముందే ఈ యువ జంట మృతిచెందడం వారి కుటుంబాల్లో తీవ్ర బాధను మిగిల్చింది.
బోట్ ఆపరేటర్ ఎక్కాపోంగ్ కింగ్లెక్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే యువ జంట మృత్యువాతన పడ్డారని అతనిపై థాయ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోమవారం చెప్పారు. లైఫ్ జాకెట్లను బోట్ ఆపరేటర్ ధరించమని అడినా వారు వాటిని ధరించడానికి నిరాకరించారని పోలీసులు తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications