థాయిలాండ్లో హైదరాబాద్ యువ జంట మృతి (ఫోటో)
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన యువ దంపతులు థాయిలాండ్లో మృత్యువాత పడ్డారు. విహార యాత్రకు వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదం నింపారు. నగరానికి చెందిన పారిశ్రామిక వేత్త (సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) యశ్ అగర్వాల్ (27), పంకూరి మిఠల్ (26) దంపతులు.
ఈ నెల 2న వీరిద్దరు విహార యాత్రకు బ్యాంకాక్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం థాయిలాండ్లోని పాపులర్ బీచ్లలో ఒకటైన ఓ నాంగ్ బీచ్కి వెళ్లారు. తుఫాను వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా అగర్వాల్ దంపతులు బోట్లో సముద్రంలోనికి వెళ్లారు.

వాతావరణ పరిస్దితి బాగా లేకపోవడంతో బోటును వెనక్కి మళ్లించారు. తీరానికి కొద్ది దూరంలో ఉండగా బోటు తిరగడబడడంతో యువ జంట మునిగింది. ఓ గంట తర్వాత ఇద్దరి మృతదేహాలు నీటితో తేలుతూ కనిపించాయి.
ఒక్కగానొక్క కుమారుడు, కోడలు మృత్యువాతపడడంతో మహేంద్ర అగర్వాల్ నివాసంలో విషాదం నెలకొంది. వివాహమై ఏడాదిన్నర గడవకముందే ఈ యువ జంట మృతిచెందడం వారి కుటుంబాల్లో తీవ్ర బాధను మిగిల్చింది.
బోట్ ఆపరేటర్ ఎక్కాపోంగ్ కింగ్లెక్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే యువ జంట మృత్యువాతన పడ్డారని అతనిపై థాయ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోమవారం చెప్పారు. లైఫ్ జాకెట్లను బోట్ ఆపరేటర్ ధరించమని అడినా వారు వాటిని ధరించడానికి నిరాకరించారని పోలీసులు తెలిపారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications