ఉర్రూతలూగించిన దేవిశ్రీ: అదరగొట్టిన డ్యాన్సర్లు(పిక్చర్స్)
వాషింగ్టన్: ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆట పాటలతో అమెరికాలోని తెలుగు ప్రవాసులను అలరించారు. అమెరికాలోని బే ఏరియాలోని శాన్ జోష్ ఈవెంట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో దేవిశ్రీ తన ఆటపాటలతో ఆకట్టుకున్నారు. పలువురు దేవిశ్రీ పాటలకు పలువురు డాన్సర్లు నృత్యాలు చేసి ఉర్రూతలూగించారు.
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రవాసులు హాజరయ్యారు. ఈ ప్రదర్శనలను వీక్షించేలా ఎల్సిడి స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. ప్రముఖ టీవీ యాంకర్ అనుసూయ తన యాంకరింగ్తో అహుతులను ఆకట్టుకున్నారు. మొదట ఆమె కార్యక్రమ నిర్వాహకులను వేదికకు పరిచయం చేశారు. ఆ తర్వాత గాయకులు రనినా, నేహా బేసిన్, రీటా, సాగర్, సూరజ్ శాంతిషిలను పరిచయం చేశారు.
అనంతరం ఆమె దేవీశ్రీ ప్రసాద్ను వేదికపైకి ఆహ్వానించారు. వన్ నేనొక్కడినే సినిమాలోని ‘హు ఆర్ యూ' పాటతో తన ప్రదర్శనను ప్రారంభించారు దేవిశ్రీ. కార్యక్రమం ముగింపు వరకు దేవిశ్రీ, అతని బృందం అద్భుతమైన పాటలు, డ్యాన్సులతో ఉర్రూతలూగించారు. చప్పట్లు, కేరింతలు కొడుతూ చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రదర్శనను ఎంజాయ్ చేశారు. దేవిశ్రీ పాటల మధ్యలో తన మాటలతో అహుతులను ఆకట్టుకున్నారు.
గబ్బర్ సింగ్ సినిమాలోని పాట కోసం దేవీశ్రీ ప్రసాద్ పోలీస్ వేషంలో పాట పాడుతూ డ్యాన్స్ చేసి అలరించారు. గాయని మాలతి ‘మిర్చ' సినిమాలోని ఓ పాటను పాడి అహుతుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఎప్పుడూ గుర్తిండిపోయేలా జరిగిందని అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన దర్శకత్వంలోని పాటలు పాడుతూ అమెరికాలోని తెలుగు ప్రవాసులను అలరించారు.
దేవిశ్రీ ప్రసాద్
గబ్బర్ సింగ్ సినిమాలోని పాట కోసం దేవీశ్రీ ప్రసాద్ పోలీస్ వేషంలో పాట పాడుతూ డ్యాన్స్ చేసి అలరించారు.
దేవిశ్రీ ప్రసాద్
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రవాసులు హాజరయ్యారు. ఈ ప్రదర్శనలను వీక్షించేలా ఎల్సిడి స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు.
దేవిశ్రీ ప్రసాద్
అమెరికాలోని బే ఏరియాలోని శాన్ జోష్ ఈవెంట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో దేవిశ్రీ తన ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
దేవిశ్రీ ప్రసాద్
పలువురు దేవిశ్రీ పాటలకు పలువురు డాన్సర్లు నృత్యాలు చేసి ఉర్రూతలూగించారు.
భారీ సంఖ్యలో హాజరు
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రదర్శనను తిలకించేందుకు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగు ప్రవాసాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
అనసూయ
ప్రముఖ టీవీ యాంకర్ అనుసూయ తన యాంకరింగ్తో అహుతులను ఆకట్టుకున్నారు. మొదట ఆమె కార్యక్రమ నిర్వాహకులను వేదికకు పరిచయం చేశారు.
దేవిశ్రీ ప్రసాద్
ఆ తర్వాత గాయకులు రనినా, నేహా బేసిన్, రీటా, సాగర్, సూరజ్ శాంతిషిలను పరిచయం చేశారు. అనంతరం ఆమె దేవీశ్రీ ప్రసాద్ను వేదికపైకి ఆహ్వానించారు. వన్ నేనొక్కడినే సినిమాలోని ‘హు ఆర్ యూ' పాటతో తన ప్రదర్శనను ప్రారంభించారు దేవిశ్రీ.