భారతీయుడిపై కాల్పులు: తీవ్రగాయాలు
మనీలా: భారత సంతతికి చెందిన ఓ యువకుడిపై సాయుధులైన ఇద్దరు దుండగులు బైకుపై వెళుతూ తుపాకులతో కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఫిలిప్పీన్స్లోని జంబోంగ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. రెండు సార్లు కాల్పులు జరపడంతో అతడి తలకు, శరీరానికి బుల్లెట్ల గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
సుఖ్జిందర్ సింగ్(28) తన ఇంటి నుంచి కజిన్ ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, గత సంవత్సరంలో కూడా ఆ ఇద్దరు ఫిలిపినో దొంగలు జంబోంగాలో ఓ చిన్న వ్యాపారం చేసుకుంటున్న భారత వ్యాపారి హర్పీత్పై దాడి చేశారని పోలీసులు తెలిపారు.

కాగా, 2012, అక్టోబర్లో తావి తావి ప్రావీన్స్ నుంచి వచ్చిన ఐదుగురు భారతీయులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద పాస్పోర్టులు లేవని, వారి వద్ద ఉన్నవి కేవలం నకిలీ లేబర్ పర్మిట్లు మాత్రమేనని చెప్పారు.
జంబోంగాలో స్థిరపడిన చాలా మంది భారతీయులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. మరికొంత మంది స్థానిక యువతులను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయారని చెప్పారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications