బాబుకు ఆహ్వానం: నాట్స్ 52లక్షల విరాళం(పిక్చర్స్)
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం కోసం రూ. 52 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా అమెరికాలోని లాస్ఏంజెల్స్లో 2015 జులైలో నిర్వహించే ‘నాట్స్' ఉత్సవాల్లో పాల్గొనాలని చంద్రబాబును నాట్స్ ప్రతినిధులు ఆహ్వానించారు.
నాట్స్ అధ్యక్షుడు దేసు గంగాధర్, ఉపాధ్యక్షడు రవి ఆచంట, సమన్వయకర్త రాజా అలపాటి తదితర ప్రతినిధుల బృందం లేక్వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును కలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కోటి రూపాయల విరాళాన్ని అందించింది. లేక్ వ్యూ అతిథి గృహంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబుని కలిసిన డిసిసిబి అధ్యక్షుడు రాజశేఖర్, డైరెక్టర్లు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.
విరాళాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కోటి రూపాయల విరాళాన్ని అందించింది.
విరాళాలు
లేక్ వ్యూ అతిథి గృహంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబుని కలిసిన డిసిసిబి అధ్యక్షుడు రాజశేఖర్, డైరెక్టర్లు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.
విరాళాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం కోసం రూ. 52 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
విరాళాలు
ఈ సందర్భంగా అమెరికాలోని లాస్ఏంజెల్స్లో 2015 జులైలో నిర్వహించే ‘నాట్స్' ఉత్సవాల్లో పాల్గొనాలని చంద్రబాబును నాట్స్ ప్రతినిధులు ఆహ్వానించారు.
నాట్స్ ఆహ్వానం
నాట్స్ అధ్యక్షుడు దేసు గంగాధర్, ఉపాధ్యక్షడు రవి ఆచంట, సమన్వయకర్త రాజా అలపాటి తదితర ప్రతినిధుల బృందం లేక్వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును కలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.