హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చోరీకి గురైన ఎన్నారై దంపతులు

|
Google Oneindia TeluguNews

robbed
హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్‌బి కాలనీలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న తమ కుమారుడ్ని చూసివెళ్లేందుకు విదేశం నుంచి వచ్చిన ప్రవాస భారతీయ దంపతులు చోరీకి గురయ్యారు. వారి వద్ద ఉన్న 7,500 అమెరికన్ డాలర్లు, మూడు బంగారు గొలుసులు అపహరణకు గురయ్యాయని ఎన్నారై దంపతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ చోరీ తాము బస చేసిన గ్రాండ్ స్వాగత్‌లోని గదిలో జనవరి 1న జరిగిందని తెలిపారు.

కెపిహెచ్‌బి పోలీసులు తెలిపిన ప్రకారం.. చోరీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వెస్టిండీస్‌లో డాక్టర్ శ్రీధర్, ఆయన భార్య అరుణ నివాసముంటున్నారు. వారి కుమారుడు నగరంలోని కెపిహెచ్‌బిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాడు. కాగా డిసెంబర్ 30న నగరానికి వచ్చిన శ్రీధర్ దంపతులు గ్రాండ్ స్వాగత్‌లోని ఓ గదిలో బస చేశారు.

కాగా జనవరి 1న తమ గదిలోని 7, 500 డాలర్లను, మూడు బంగారు గొలుసులు అపహరణకు గురైనట్లు వారు గుర్తించారు. తాము నిద్రిస్తున్న సమయంలో గది కిటికి గుండా ఎవరో ప్రవేశించి అపహరణకు పాల్పడ్డట్లు శ్రీధర్ అనుమానం వ్యక్తం చేశారు.

హోటల్‌ లోపల సిసిటీవిలు ఏర్పాటు చేయబడి ఉన్నాయని, అయితే అవి దొంగతనం జరిగిన గదిని కవర్ చేయలేకపోయాయని పోలీసులు తెలిపారు. గురువారం రోజున కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.

English summary
A NRI doctor couple who came to the city to meet their son studying at a private college in KPHB Colony lodged a complaint stating that US $ 7,500 cash and three gold chains went missing from their room at Grand Swagath, on January 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X