టీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక
టీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాధారపు సతీష్ ఎన్నికయ్యారు.
బహ్రెయిన్: ఎన్నారై టి. ఆర్. యస్ బహ్రెయిన్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాధారపు సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యమ సమయం నుండి నేటి వరకు బహరైన్ లో టి. ఆర్. యస్ పార్టీ శాఖను ఏర్పాటు చేసి తెలంగాణ బిడ్దలందరిని ఏకం చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ, కేసీఆర్ గారి నాయకత్వ అవసరాన్ని చాటి చెప్తూ, స్వరాష్ట్రానికి మైళ్ళ దూరం లో ఉన్నా వీరి సామాజిక బాధ్యత ఎందరికో స్పూర్తిగా నిలిచింది.
సతీష్ మాట్లాడుతూ...బ్రతుకుదెరువుకు బహ్రెయిన్ వచ్చిన మాకు, నాడు తెలంగాణ ఉద్యమం
లో మరియు నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో మాకు అవకాశం కలిపిచ్చిన కే సీఆర్ గారికి, వ్యక్తిగంతంగా బహరైన్ వచ్చి మాలో స్పూర్తిని నింపి మామ్మల్నీ ప్రోత్సహించిన
ఎంపీ కవిత గారికి, అలాగే అన్ని సందర్బాల్లో సహకరించి ముందుకు నడిపిస్తున్న యావత్ టి.ఆర్. యస్ పార్టీ నాయకులకు, కార్యవర్గ సభ్యులందరి తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

సందర్భం ఏదైనా నేడు తెలంగాణ సమాజం టి. ఆర్. యస్ పార్టీ ని, కే సీ ఆర్ గారి
నాయకత్వాన్ని బలపర్చడం చారిత్రక అవసరమని, మావంతు బాధ్యత గా క్రమశిక్షణ
కలిగిన కార్యకర్తల్లాగా అందరితో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు.
వివిద దేశాల్లో ఉన్నప్పటికీ అనుక్షణం మాకు సహకరిస్తున్నఎన్నారై టి. ఆర్. యస్
నాయకులు అనిల్ కూర్మాచలం గారికి, మహేష్ తన్నీరు గారికి మరియు జువ్వాడి
శ్రీనివాస్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
నూతన కమిటీ వివరాలు :
వర్కింగ్ ప్రెసిడెంట్ -సతీష్ కుమార్ రాధారపు వైస్ ప్రెసిడెంట్ -వెంకటేష్ బోలిశట్టి
జనరల్ సెక్రెటరీ లు -లింబాద్రి పుప్పల మరియు డా. రవి
సెక్రెటరీలు - ప్రశాంత్ పిట్ల, రవి పటేల్ దెషెట్టి మరియు సుమన్ అన్నారం
జాయంట్ సెక్రెటరీ లు - సదనంద్ రేగుల్ల, గంగాధర్ గుమ్ముల, రాజేంధార్
మగ్గిడి మరియు సంజీవ్ బురమ్
ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ - సుధాకర్ ఆకుల, రాజేష్ ప్రశాంత్, రాజు నేరెళ్ళ , నర్సయ్య శానిగరం.












Click it and Unblock the Notifications