మెంఫిస్లో సంక్రాంతి సంబరాలు (పిక్చర్స్)
న్యూయార్క్: అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ పట్టణంలో ‘మెంఫిస్ తెలుగు సమితి' ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకుల కోసం స్థానిక సౌత్ విండ్ హై స్కూల్ను ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 700మంది తెలుగువారు సకుటుంబ సపరివారంగా పాల్గొన్నారు.
బొమ్మల కొలువు, రంగురంగుల రంగవళ్ళులు, సన్నాయి రాగాలు,సంక్రాంతి పాటలు, తెలుగు పడుచుల ఆహ్వానాలతో సంక్రాంతి పండుగ ఎంతో కోలాహలంగా మొదలయింది. వేదికను సంక్రాంతిశోభ ఉట్టిపడే విధంగా అందంగా అలంకరించారు. వేదికపై జరిగిన భోగి పళ్ళ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సంప్రదాయ సంగీత నృత్యాలతో ప్రారంభమయిన కార్యక్రమం సుమారు నాలుగు గంటల పాటు సాగింది. చిన్నారులు చేసిన సినీ నృత్యాలు అందరినీ అలరించాయి. యువతులు చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో వర్ధమాన గాయకుడు సందీప్ కురపాటి పాల్గొని తన పాటలతో సంబరాలను అంబారాన్నంటించారు.
ఉషారయన పాటలకు పిల్లలు ఆనందంగా చిందులు వేశారు. ఈ సంబరాలను పురస్కరించుకుని తెలుగు అసోషియేషన్ ఆఫ్ మెంఫిన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, ముద్దు మాటలు, పద్యాలు, బుల్లికథలు, వ్యాసాలు, వాః ఏమిరుచి, ఆహా ఏమి రుచి, గోరింటాకు, ముత్యాల ముగ్గులు తదితర పోటీలు ఎంతో ఆహ్లాదభరితంగా సాగాయి. ఈపోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమం తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెంఫిన్ అధ్యక్షుడు యెదురు పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఉపాధ్యక్షుడు గోపి జవాబ్ నవీస్, సహా ఉపాధ్యక్షుడు రంజిత్ కొమరెల్లి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మండలపు, సహ ప్రధాన కార్యదర్శి మదన్ వెన్న, కోశాధికారి సుబ్బారెడ్డి కర్నాటి, సహా కోశాధికారి రమేష్ నర్సాపురం, సాంసృతిక కార్యదర్శి రత్నాకర్రావు వాన, సాంస్కృతిక సహా కార్యదర్శి స్వప్న వొంటరి, క్రీడల విభాగ కార్యదర్శి శ్రీనివాస్ బుసిరెడ్డి, క్రీడల విభాగ సహా కార్యదర్శి అరవింద్ నూనె, ఫుడ్ కమిటీ చైర్ పర్సన్చంద్రశేఖర్ పొట్నూరు, క్రియేటివ్ డైరెక్టర్ సత్య ప్రోద్దుటూరి, మీడియా చైర్ పర్సన్ సింధూర కల్లేపల్లి, యూత్ కమిటీ చైర్ పర్సన్ రవిపోలూరి, మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ రాజేంద్ర తంగళ్లపల్లి, మార్కెటింగ్ కమిటీ ఉప చైర్ పర్సన్ అరుణ్ ద్యసాని, ధర్మకర్తల అధ్యక్షుడు వీరభద్రం నరిశెట్టి, ధర్మకర్తలు స్వామి పొలస, ఉదయ్ నట్ర , రాజ్ తోట, సురేశ్ కొత్త ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సంక్రాంతి సంబరాలు
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ పట్టణంలో ‘మెంఫిస్ తెలుగు సమితి' ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సాహంగా జరిగాయి.
సంక్రాంతి సంబరాలు
ఈ వేడుకుల కోసం స్థానిక సౌత్ విండ్ హై స్కూల్ను ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 700మంది తెలుగువారు సకుటుంబ సపరివారంగా పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాలు
బొమ్మల కొలువు, రంగురంగుల రంగవళ్ళులు, సన్నాయి రాగాలు,సంక్రాంతి పాటలు, తెలుగు పడుచుల ఆహ్వానాలతో సంక్రాంతి పండుగ ఎంతో కోలాహలంగా మొదలయింది.
సంక్రాంతి సంబరాలు
వేదికను సంక్రాంతిశోభ ఉట్టిపడే విధంగా అందంగా అలంకరించారు. వేదికపై జరిగిన భోగి పళ్ళ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాలు
సంప్రదాయ సంగీత నృత్యాలతో ప్రారంభమయిన కార్యక్రమం సుమారు నాలుగు గంటల పాటు సాగింది. చిన్నారులు చేసిన సినీ నృత్యాలు అందరినీ అలరించాయి.
సంక్రాంతి సంబరాలు
యువతులు చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో వర్ధమాన గాయకుడు సందీప్ కురపాటి పాల్గొని తన పాటలతో సంబరాలను అంబారాన్నంటించారు.
సంక్రాంతి సంబరాలు
ఉషారయన పాటలకు పిల్లలు ఆనందంగా చిందులు వేశారు. ఈ సంబరాలను పురస్కరించుకుని తెలుగు అసోషియేషన్ ఆఫ్ మెంఫిన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, ముద్దు మాటలు, పద్యాలు, బుల్లికథలు, వ్యాసాలు, వాః ఏమిరుచి, ఆహా ఏమి రుచి, గోరింటాకు, ముత్యాల ముగ్గులు తదితర పోటీలు ఎంతో ఆహ్లాదభరితంగా సాగాయి. ఈపోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు.
సంక్రాంతి సంబరాలు
2016 యువ కార్యవర్గ సంఘం ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ఎంతో ఉత్సాహంతో పని చేశారు.
సంక్రాంతి సంబరాలు
2015వ సంవత్సరంలో సేవలు అందించిన కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ జ్ఞాపికలను అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా సేవలు అందించిన ధర్మకర్త, శేషాద్రి బెల్డేకి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ జ్ఞాపిక అందజేశారు.