Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Firing: అమెరికాలో కాల్పులు.. ఆంధ్రప్రదేశ్ వాసి మృతి..

అమెరికాలో కాల్పులు(Firing) సర్వసాధారణమయ్యాయి. నిత్యం ఏదో చోట కాల్పులు జరిగి ప్రజలు మణికిపోతున్నారు. తాజాగా ఆమెరికాలోని ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏపీ చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్‌ కాల్పుల్లో మరణించాడు. ఎంఎస్‌ చేయడానికి వెళ్లిన సాయేశ్‌ గ్యాస్‌ స్టేషన్లో పార్ట్‌టైం ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 20న ఓ దొంగల ముఠా వచ్చి విధుల్లో ఉన్న అతణ్ని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. సాయేశ్‌ 2021 నవంబరులో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. అతని తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోయాడు. నాలుగు రోజుల క్రితం కూడా అమెరికాలో కాల్పులు జరిగాయి.

మైనేలోని ఒక ఇంటిలో మంగళవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ తర్వాత హైవేపై వెళ్తున్న వాహనాలపై కూడా కాల్పులు జరిగాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు అంతర్రాష్ట్ర రహదారిలో కొంత భాగాన్ని మూసివేశారు. సాధారణ పౌరులు ఎవరు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత నిషేదాజ్ఞలు ఎత్తేశారు. దాదాపు 90 నిమిషాలు పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆదీనంలోకి తీసుకున్నారు.

gunfiring-

మైనేలో బోడోయిన్‌కు చెందిన జోసెఫ్ ఈటన్ 34 కాల్పులకు తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ కాల్పులకు కారణాలు తెలియరాలేదు. మరో వైపు యర్‌మౌత్‌లోని ఇంటర్‌స్టేట్ 295లో దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో కాల్పులతో జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొందరు పొడవాటి రైఫిళ్లను తీసుకుని హైవే పైకి వచ్చి కాల్పులు జరిపారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఆఫ్-ర్యాంప్ వద్ద భారీగా సాయుధ అధికారులు విండ్‌షీల్డ్‌లో స్పష్టంగా బుల్లెట్ రంధ్రాలు ఉన్న కారు గుర్తించారు.

murder1-

కొద్ది రోజుల క్రితం అమెరికాలో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. US మీడియా ప్రకారం, టెలివిజన్ స్టేషన్ WRBL ఆదివారం తెల్లవారుజామున అలబామాలోని డాడెవిల్లేలో కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో ఎక్కువగ యువత ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు కాల్పులు జరిగాయి. ఒక యువకుడి పుట్టినరోజు వేడుకలో కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నాష్‌విల్లేలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఓ మహిళా దుండగురాలు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 6 మంది మరణించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆమె మరణించారు. ఈ ఘటన జరిగిన పాఠశాల ప్రీ స్కూల్. అందులో చదువుతున్న పిల్లలంతా 12 ఏళ్లలోపు వారే ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+