భారతీయులకు స్కెంజెన్ వీసాలను నిలిపివేయలేదు: స్విట్జర్లాండ్ ఎంబసీ క్లారిటీ
న్యూఢిల్లీ: వీసాల అపాయింట్మెంట్లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్విట్జర్లాండ్ స్పష్టతనిచ్చింది. ఐరోపా సమాఖ్య దేశాల్లో వీసా ఆంక్షలు లేకుండా పర్యటించేందుకు జారీ చేసే వీసాల అపాయింట్మెంట్లు అక్టోబర్ వరకు నిలిపివేశారనే వార్తల్లో నిజం లేదని భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం వెల్లడించింది.
భారత పర్యాటక గ్రూపులకు స్కెంజెస్ వీసా(Schengen visa)లను నిలిపివేయలేదని.. కరోనా కంటే ముందుస్థాయిని దాటిందని తెలిపింది. భారత్-స్విస్ పౌరుల మధ్య బంధం ఎంతో ప్రధానమైందన్నారు. కాగా, భారత పర్యాటక బృందాలకు వీసా అపాయింట్మెంట్లను భారత్లోని స్విట్జర్లాండ్ ఎంబసీ నిలిపివేయలేదన్నారు.

సెప్టెంబర్ 2023 వరకు నిత్యం దాదాపు 800 అపాయింట్మెంట్లు ఉన్నాయని, ఇందులో 22 బృందాలు ఉన్నాయని తెలిపారు. 2019తో పోలిస్తే 2023లో ఇప్పటి వరకు అత్యధిక వీసాలను జారీ చేశామన్నారు. జనవరి నుంచి జూన్ వరకు 1.29 లక్షల దరఖాస్తులను పరిశీలించామని తెలిపారు. కోవిడ్ ముందుతో పోలిస్తే 7.8 శాతం ఎక్కువ అని పేర్కొంది. ఈ మేరకు భారతదేశంలోని స్విట్జర్లాండ్ ఎంబసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
అంతేగాక, భారతీయుల వీసాల ప్రక్రియను ఈ ఏడాది మరింత సులభతరం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో మొదటిది.. ప్రయాణానికి ఆరు నెలల ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ఇది కేవలం నెల మాత్రమే ఉండేది. లక్నోలో దరఖాస్తు కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని, దీంతో భారతదేశంలో ఈ కేంద్రాల సంఖ్య 13కు చేరుకుంటుందని స్విస్ ఎంబసీ పేర్కొంది. అంతేగాక, తమ భాగస్వామ్య విభాగం వీఎఫ్ఎస్ నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత గరిష్టంగా 13 రోజుల్లోనే వీసాపై ఎంబసీ నిర్ణయం వెలువడుతుందని తెలిపింది.
కాగా, ఐరోపా దేశాల మధ్య 90 రోజుల వరకు పర్యటించేందుకు వీలుగా స్కెంజెస్ వీసాలను జారీ చేస్తుంటారు. ఐరోపా సమాఖ్యలోని ఏదైనా సభ్యదేశం దీనిని జారీ చేస్తే.. దానిపై ఇతర యూరప్ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి లభిస్తుంది. అందుకే ఈ వీసాలకు పర్యాటకుల నుంచి మంచి డిమాండ్ ఉంటుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications