గుంటూరులో తానా క్యాన్సర్ క్యాంపు(పిక్చర్స్)
గుంటూరు: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా నిర్వాహకులు గుంటూరులో గత శనివారం మెగా క్యాన్సర్ స్ర్కీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన గ్రేస్ ఫౌండేషన్, గుంటూరుకు చెందిన బైబిల్ మిషన్ భాగస్వాములయ్యాయి.
200మందికిపైగా ఫిజిషియన్లు, 400మంది నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, అనేక మంది వాలంటీర్లు ఈ క్యాంపులో సేవలందించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక రోజులో 2,790మంది మహిళలు బ్రీస్ట్, కార్వికల్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. 193మంది మహిళలకు బ్రీస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, కార్వికల్ క్యాన్సర్ నివేదికలు రావాల్సి ఉంది.
క్యాన్సర్ ఉన్నట్లు తేలిన మహిళలకు వైద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రేస్ ఫౌండేషన్, ఫిజిషియన్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లకు తానా అధ్యక్షుడు డా. చౌదరి జంపాల, తానా ఫౌండేషన్ శ్రీనివాస గోగినేనిలు ధన్యవాదాలు తెలిపారు. వారి మద్దతు లేకుండా ఇంతపెద్ద కార్యక్రమం విజయవంతమయ్యేది కాదని అన్నారు.
తానా ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. అనాథ చిన్నారులకు భోజనం, ఆరోగ్యం, విద్య లాంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నట్లు తెలిపారు.
తానా డైరెక్టర్, అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, జయ్ తళ్లూరి, రమాకాంత్ కోయ, త్రిలోక్ కంతేటి, ప్రసాద్ గారపాటితోపాటు చాలా మంది ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయమందించినట్లు తెలిపారు. తానా ఫౌండేషన్ క్యాన్సర్ స్ర్కీనింగ్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్లు అశోక్ బాబు కొళ్ల, అనిల్ లింగమనేనిలు క్యాంపు నిర్వహణలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కాగా, ఈ క్యాంపును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు.

మెగా క్యాన్సర్ క్యాంపు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా నిర్వాహకులు గుంటూరులో గత శనివారం మెగా క్యాన్సర్ స్ర్కీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన గ్రేస్ ఫౌండేషన్, గుంటూరుకు చెందిన బైబిల్ మిషన్ భాగస్వాములయ్యాయి.

మెగా క్యాన్సర్ క్యాంపు
200మందికిపైగా ఫిజిషియన్లు, 400మంది నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, అనేక మంది వాలంటీర్లు ఈ క్యాంపులో సేవలందించారు.

మెగా క్యాన్సర్ క్యాంపు
ప్రాథమిక అంచనా ప్రకారం ఒక రోజులో 2,790మంది మహిళలు బ్రీస్ట్, కార్వికల్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. 193మంది మహిళలకు బ్రీస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, కార్వికల్ క్యాన్సర్ నివేదికలు రావాల్సి ఉంది.

మెగా క్యాన్సర్ క్యాంపు
క్యాన్సర్ ఉన్నట్లు తేలిన మహిళలకు వైద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మెగా క్యాన్సర్ క్యాంపు
ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రేస్ ఫౌండేషన్, ఫిజిషియన్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లకు తానా అధ్యక్షుడు డా. చౌదరి జంపాల, తానా ఫౌండేషన్ శ్రీనివాస గోగినేనిలు ధన్యవాదాలు తెలిపారు. వారి మద్దతు లేకుండా ఇంతపెద్ద కార్యక్రమం విజయవంతమయ్యేది కాదని అన్నారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications