NRI News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారత విద్యార్థుల మృతి..
అమెరికాలో ఈ మధ్య తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతోన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో భారతీయ విద్యార్థులు మృతి చెందుతున్నారు. తాజాగా జార్జీయాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించారు. ఇందులో ఓ తెలుగు అమ్మాయి కూడా ఉంది. మే 14న జార్జియా యూనివర్శిటీలో చదువుతున్న శ్రీయా, ఆర్యన్ జోషి, రిత్వక్ సోమేపల్లి, అన్వీ శర్మ, మహ్మద్ లియాకత్ కారులో ఓ కార్యక్రమానికి బయల్దేరారు.
వారు ప్రయాణిస్తున్న కారు జార్జియాలోని అల్ఫారెట్టా వద్ద అదుపు తప్పి బలంగా చెట్టును ఢీకొంది. ప్రమాదస్థిలిలోనే శ్రీయా, ఆర్యన్ జోషి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే అన్వీ శర్మ కూడా మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రిత్వక్ సోమేపల్లి, మహ్మద్ లియాకత్ చికిత్స పొందుతున్నారు. ఈ కారు ప్రమాదానికి అతి వేగమే కారణమని అక్కడి పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. గత నెలలో అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. అంతకు ముందు ఏపీ చెందిన ఓ కుటుంబం కూడా రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన కమతం నరేష్ ఆయన భార్య గీతాంజలి అమెరికాలో నివసిస్తున్నారు.
వీరికి ఆరు సంవత్సరాల కూతురు హీనిక, మూడేళ్ల కుమారుడు బ్రమణ్ ఉన్నాడు. వీరి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గీతాంజలి, హీనిక మృతి చెందారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications