NRI News: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ విద్యార్థుల మృతి..

సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు. గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లోని ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్నారు.

విద్యార్థుల మృతితో బుధవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. 11వ తరగతి చదువుతున్న హసన్ రియాజ్, 9వ తరగతి చదువుతున్న ఇబ్రహీం అజర్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, 8వ తరగతి చదువుతున్న ఇబ్రహీం సోదరుడు అమ్మర్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

deadbody

మంగళవారం దమ్మామ్‌లో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని ధ్వంసమైంది. ఇబ్రహీం గురువారం హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్త నాస్ వోక్కమ్ మరణించిన విద్యార్థుల చట్టపరమైన లాంఛనాలు, అంత్యక్రియలను పూర్తి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు, ఇతర సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు.

మరో ఘటనలో హైదరాబాద్ కు చెందిన యువతి హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని తల్లితండ్రులు హైదరాబాద్ లోని చంపాపేటలో స్థిరపడ్డారు. తేజస్విని పై చదువుల కోసం లండన్ వెళ్లింది. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో ఉంటూ చదువుకుంటోంది. తేజస్విని, అఖిల అనే విద్యార్థినిలపై బ్రెజిల్ కు చెందిన యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తేజస్విని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+