అసహజమైన రతి, అత్యాచారం: భర్తపై భార్య ఫిర్యాదు

ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగికంగా తీవ్రంగా వేధించినట్లు నిర్ధారణ కావడంతో బాధితురాలు తన మెడికల్ రిపోర్టులను కూడా తమకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త బహుళజాతి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు కూడా ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తోంది.
బాధితురాలికి, పునీత్కి నవంబర్ 29న వివాహమైందని పోలీసులు చెప్పారు. అనంతరం వీరిద్దరూ బ్యాంకాక్కు వారంపాటు(డిసెంబర్ 1 నుంచి 8 వరకు) హనీమూన్ వెళ్లి వచ్చారు. ఈ పర్యటనలో పునీత్ భరద్వాజ్ తనపై దారుణమైన అత్యాచారాలకు, అసహజ రతికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. దీని వల్ల తను శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురయ్యానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
తను మాల్దీవులకు వెళ్దామంటే.. తన భర్త బ్యాంకాక్కు తీసుకెళ్లాడని తెలిపింది. తనతో అతను ప్రవర్తించిన తీరును తన తల్లిదండ్రులకు తెలిపానని, వారు పోలీసులను సంప్రదించాలని కోరడంతో పోలీసులకు వారితో కలిసి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది. విచారణ ప్రారంభించిన పోలీసులు, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications