శ్రీదాసు శ్రీరాములుపై జాతీయ సదస్సు
చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను అభ్యసించి తన పన్నెండవ ఏట నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసి పండితుల ప్రశంసలను అందుకున్నారు. ఇరవై సంవత్సరాల వయసుకే తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని సంపాదిందారు. తరువాత కాలంలో ఆంగ్లాన్ని అభ్యసించి 1878 సంవత్సరంలో ప్లీడరుగా మచిలీపట్నంలో ప్రాక్టీసు ప్రారంభించి, 1884లో ఫస్టు గ్రేడు ప్లీడరుగా పనిచేశారు.
తరువాత కాలంలో న్యాయవాదవృత్తిని వదిలి తన జీవితాన్నంతటినీ సాహిత్య సేవకు కేటాయించారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించారు. శ్రీదేవీ భాగవతము, వైశ్యధర్మదీపిక, అభినయ దర్పణము, సంగీత రసతరంగిణి(బౌద్ధనాటకం), మాలతీమాధవము, అచ్చతెలుగు అభిజ్ఞాన శాకుంతలము, ఉత్తర రామ చరితము, ముద్రారాక్షసము, సాత్రాజితీ విలాసము మొదలైన 33 రచనలు చేశారు.
1880లో ‘కల్పవల్లి' అనే పత్రికను స్థాపించి స్ర్తీపునర్వివాహం, పాశ్చాత్యవిద్యాప్రశంస వంటి సంస్కరణ భావాలకు ఊతమిచ్చారు. ఈయన రాసిన రచనలగురించి గానీ, ఇతర రచనలతో తులనాత్మకంగా గానీ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది.