ఆ యాప్ ఇక పనిచేయదు: Facebook కీలక ప్రకటన
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా మెసెంజర్ డెస్క్టాప్ యాప్ను (Mac, Windows ప్లాట్ఫారమ్ల కోసం) అధికారికంగా నిలిపివేసింది. ఇకపై ఈ సేవలను ఉపయోగించాలనుకునే యూజర్లు Facebook వెబ్సైట్ లేదా Messenger.com ద్వారా మాత్రమే మెసెంజర్ను యాక్సెస్ చేయాల్సి ఉంటుంది.ఈ నిర్ణయం మెటా వ్యూహంలో జరిగిన కీలక మార్పును సూచిస్తుంది. Covid 19 మహమ్మారి సమయంలో ప్రారంభమైన ఈ డెస్క్టాప్ యాప్, జూమ్ వంటి పోటీదారులతో పోటీ పడటంలో ఇబ్బందులు ఎదుర్కొంది.
కంపెనీ ఈ యాప్లను నిలిపివేయబోతున్నట్లు అక్టోబర్ నెలలోనే ప్రకటించింది. AppleInsider నివేదిక ప్రకారం, డిసెంబర్ 15 నుండి యూజర్లకు నోటిఫికేషన్లు పంపించడం ప్రారంభమవుతుంది. యాప్లు పూర్తిగా ఇన్యాక్టివ్గా మారేందుకు 60 రోజుల గడువు ఇవ్వనున్నారు.ఆ గడువు ముగిసిన తర్వాత ఈ యాప్లు పనిచేయవు. అందువల్ల, నిరుపయోగంగా మారిన యాప్లను తమ డివైస్ల నుంచి తొలగించాలని మెటా యూజర్లను కోరుతోంది.

ఈ విషయానికి సంబంధించిన వివరాలు మెటా సపోర్ట్ పేజీలో పేర్కొంది. మ్యాక్ యూజర్లకు ఈ మార్పును ప్రత్యేకంగా తెలియజేసింది.మెసెంజర్ డెస్క్టాప్ యాప్ను నిలిపివేయడానికి చాలా కారణాలున్నాయి.స్క్రీన్ షేరింగ్, గ్రూప్ వీడియో కాల్ వంటి కీలక ఫీచర్లు లేకపోవడంతో, ఈ యాప్ యూజర్లను ఆకట్టుకోలేకపోయింది. అలాగే, 2023లో మెసెంజర్ను తిరిగి ఫేస్బుక్ యాప్లో విలీనం చేసిన మెటా, కొన్ని డెస్క్టాప్ యాప్లపై తన ఫోకస్ తగ్గించినట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
యూజర్లు తమ చాట్ హిస్టరీను సురక్షితంగా స్టోర్ చేసుకోవడానికి Secure Storageను యాక్టివేట్ చేయాలని మెటా సూచించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను భద్రపరిచేందుకు PINను సెటప్ చేయాలని, అలాగే 'Privacy and Safety > End-to-End Encrypted Chats > Message Storage' విభాగంలో ఉన్న సెట్టింగ్లను సరిచూసుకోవాలని కోరింది.ఇలా చేస్తే, యూజర్లకు చాట్ హిస్టరీ అన్ని ప్లాట్ఫారమ్లలో అందుబాటులో ఉంటుంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications