వైజాగ్ పిచ్పై 20 రోజుల ప్రాక్టీస్.. ఆసీస్తో మ్యాచ్ విజయానికి కారణం
భారత మహిళల క్రికెట్ జట్టు 20 రోజుల పాటు ప్రాక్టీస్ చేసిందని.. ఆసీస్ తో మ్యాచ్ విజయానికి అదే కారణమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) అన్నారు. ప్రస్తుతం దేశంలో మహిళలు ముందుకు వెళ్తున్నారని.. అలాగే దేశంలో పురుషుల క్రికెట్ ఎలాగైతే అభివృద్ధి చెందిందో అలాగే మహిళల క్రికెట్ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. 7సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించడమనేది.. మన మహిళా క్రికెటర్లకు ఉన్న సత్తా అంటూ కేశినేని చిన్ని కొనియాడారు.
దేశంలో మహిళలు ఎంతో ముందున్నారని.. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఎంతో మంది మహిళా కమాండర్లు పాల్గొన్నారని ఆయన తెలిపారు. మహిళా జట్టు సాధించిన విజయాన్ని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయం పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గర్వంగా ఉందన్నారు. 20 రోజులు మహిళల క్రికెట్ జట్టు వైజాగ్ లోనే ఉండి సన్నాహక మ్యాచ్ లకు సన్నద్ధం అయ్యారని ఆయన చెప్పారు. ఏసీఏ తరఫున చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళలు ఈ విధంగా విజయం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు.

భారత మహిళా జట్టు ఫైనల్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని కేశినేని చిన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను ఓడించిన జట్టుకు దక్షిణాఫ్రికాను ఓడించడం అంత కష్టమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications