Ind-NZ ODI: 3 లక్షల వాటర్ ప్యూరిఫయర్ తెచ్చుకున్న భారత క్రికెటర్..!
భారత్-న్యూజీలాండ్ మధ్య వన్డే సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెల్చుకున్న ఇరుజట్లూ రేపు ఇండోర్ లో జరిగే చివరిదైన మూడో మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, న్యూజీలాండ్ క్రికెటర్లు ఇండోర్ చేరుకున్నారు. అయితే ఓ భారత క్రికెటర్ మాత్రం తనతో పాటు 3 లక్షల రూపాయల విలువ చేసే వాటర్ ప్యూరిఫయర్ ను కూడా తెచ్చుకున్నాడట.
తాజాగా ఇండోర్ లో నీటి కాలుష్యం ఏర్పడి 23 మంది మృత్యువాత పడటం జాతీయ స్దాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల క్రికెటర్లకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందట. అయినా భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఇంకా ప్రత్యేకంగా 3 లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ ప్యూరిఫయర్ ను తన కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్నాడట. ఈ ప్యూరిఫయర్ ఆర్వో ట్రీట్ చేసి ప్యాక్ చేసిన బాటిల్ వాటర్ ను సైతం తిరిగి శుద్ధి చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసింది కావడం విశేషం.

ఈ విషయం అధికారికంగా బీసీసీఐ కానీ క్రికెటర్లు కానీ బయటికి చెప్పడం లేదు. కానీ టీమ్ బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బంది మాత్రం ఎన్డీటీవీకి ఈ విషయం వెల్లడించారు. ఈ చర్య ఇండోర్లో ఇటీవల కలుషిత నీటి వల్ల సంభవించిన మరణాలకు నేరుగా సంబంధం కలిగి ఉందా లేదా సాధారణ వ్యక్తిగత భద్రతా ప్రోటోకాల్లో భాగమా అనేది తెలియలేదు. హోటల్, స్టేడియంలో ప్యాక్ చేసిన సీసాలు మరియు ఆర్వో వ్యవస్థలతో సహా సురక్షితమైన తాగునీటి కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసినప్పటికీ .. భారత జట్టు ఈ అదనపు జాగ్రత్తను ఎంచుకుంటోంది.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications