Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ అనుమానాలు పటాపంచలు- శివతాండవమే ఇక

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. తుదిదశకు చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో ఫైనల్స్. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిట్ హాట్ ఫేవరెట్‌ భారత జట్టును ఎదుర్కొనబోతోంది న్యూజిలాండ్. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది భారత్. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత్. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఆ తరువాత పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. చివరి లీగ్‌లో బ్లాక్ క్యాప్స్‌ను ఓడించింది. ఈ మూడు మ్యాచ్‌లను ఆడింది దుబాయ్ పిచ్ మీదే. ఇప్పుడు ఫైనల్స్ కూడా అక్కడే ఆడబోతోండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. పిచ్ స్థితిగతులు ఎలా ఉంటాయనే విషయంపై సమగ్ర అవగాహన ఏర్పడినట్టయింది.

Champions Trophy 2025 final Virat Kohli who suffered a knee injury set to play against New Zealand

ఫైనల్స్ ఆడే తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవచ్చు టీమిండియా. గత ఆదివారం న్యూజిలాండ్‌ను ఓడించిన జట్టుతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నలుగురు స్పిన్నర్లు- అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని తుదిజట్టులో తీసుకోవచ్చు.

పేస్ బౌలింగ్‌ను మహ్మద్ షమీ లీడ్ చేయనున్నాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అటాకింగ్‌కు దిగడం ఖాయం. నలుగురు స్పిన్నర్లు వద్దనుకుంటే మేనేజ్‌మెంట్ బెస్ట్ ఆల్టర్నేట్.. అర్ష్‌దీప్ సింగ్. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించి.. కుల్‌దీప్ యాదవ్‌ను తప్పించవచ్చు.

ఇప్పటివరకు వన్డేల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య 119 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్‌దే పైచేయి. 61 మ్యాచ్‌లల్లో భారత్ గెలిచింది. 50 గేమ్‌లు కివీస్ సొంతం అయ్యాయి. ఒక్క మ్యాచ్ టై అయింది. ఏడు మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గాయి. ఐసీసీ ఈవెంట్‌లల్లో కూడా సమానంగా నిలిచాయి ఈ రెండు జట్లు. చెరో ఆరు మ్యాచ్‌లను గెలిచాయి.

Take a Poll

కాగా ఫైనల్స్‌‌కు ఒక్క రోజు ముందు నెట్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ గాయపడటం జట్టును ఆందోళనకు గురి చేసింది. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఫాస్ట్ బౌలర్ సంధించిన ఓ డెలివరీ నేరుగా అతని ఎడమ మోకాలిని తాకింది. కొద్దిసేపు నొప్పితో బాధపడ్డాడు కోహ్లీ. ఫిజియోథెరపిస్ట్‌తో మసాజ్ చేయించుకున్నాడు. పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాడు. నెట్స్‌ను వదిలి వెళ్లాడు. మళ్లీ ప్రాక్టీస్‌కు రాలేదు.

అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కలవరపాటుకు గురి చేసింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కేప్టెన్ రోహిత్ శర్మ.. అతని గాయం గురించి ఆరా తీశారు. ఈ టోర్నమెంట్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ మ్యాచ్ సమయానికి రికవరీ కాకపోతే ప్రత్యామ్నాయం ఏమిటనే విషయంపై చర్చించారంటూ వార్తలొచ్చాయి.

ఈ పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. విరాట్ కోహ్లీ రికవరీ అయ్యాడని తెలిపింది. అతని గాయం సాధారణమేనని, కొద్దిగా విశ్రాంతి, తేలికపాటి ట్రీట్‌మెంట్, కొంత ఫిజియో ఎక్సర్‌సైజ్ తరువాత కోలుకున్నాడని పేర్కొంది. తుదిజట్టులో చోటు దక్కబోదనే అనుమానాలు వద్దని స్పష్టం చేసింది. ఫైనల్ ఆడతాడనడంలో సందేహాలు అక్కర్లేదని వివరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+