నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది
టీమిండియా మరో చారిత్రక ఘట్టానికి తెర తీయబోతోంది. టీ20 వరల్డ్ కప్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచివుంది. ఈ సాయంత్రం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. భారత్ గెలిస్తే- మూడోసారి టైటిల్ సాధించినట్టవుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే, ఈ ట్రోఫీని గెలుచుకున్న ఏడో జట్టు అవుతుంది.
ఈ రెండూ కూడా ఐసీసీ టోర్నమెంట్ల మూడు ఫార్మాట్లు.. టెస్టులు, వన్డేలు, టీ20 ఫైనల్స్లో తలపడిన తొలి జట్లుగా చరిత్ర సృష్టించారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ఆకట్టుకుంది. గ్రూప్ దశలో అన్ని నాలుగు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైనా, జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్, ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది.

మొత్తం 30 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో న్యూజిలాండ్పై భారత్దే పైచేయి. టీమిండియా 18 విజయాలు (రెండు సూపర్ ఓవర్ గెలుపులతో సహా) నమోదు చేయగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్లలో గెలిచింది. ఒక మ్యాచ్ డీఎల్ఎస్ నిబంధనల ప్రకారం టైగా ముగిసింది. టీ20 ప్రపంచకప్లో మాత్రం రికార్డు భిన్నంగా ఉంది. ప్రపంచకప్లో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్ను ఓడించలేకపోయింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది.
2007లో 10 పరుగులు, 2016లో 47 పరుగులు, 2021లో 8 వికెట్ల తేడాతో కివీస్ గెలిచింది. మొత్తంగా ఐసీసీ ఫైనల్స్లో భారత్-న్యూజిలాండ్ తలపడటం నాలుగోసారి. గత మూడు ఫైనల్స్లో న్యూజిలాండ్ రెండుసార్లు, భారత్ ఒకసారి గెలిచాయి. 2000 అక్టోబర్ 15 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్లో, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కివీస్ గెలువగా, గత సంవత్సరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్లతో కివీస్ను ఓడించింది.
ఈ మ్యాచ్ చూడటానికి టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన రాంచీ నుండి నేరుగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సాయంత్రం ధోనీ నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకోనున్నారు. ఆయన భార్య సాక్షి సింగ్ ధోనీ, కుమార్తె జివా సింగ్ ధోనీ స్టేడియానికి రానున్నారు. మరో మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ కూడా తన కుటుంబంతో కలిసి మ్యాచ్ ను తిలకించనున్నారు.
ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ధోనీ, రోహిత్ శర్మ వాంఖెడేలో మెరిసిన విషయం తెలిసిందే. ధోనీ జెర్సీ నంబర్ 7 కావడం, సరిగ్గా ఏడు పరుగుల తేడాతో నాకౌట్ మ్యాచ్ లో భారత్ గెలవడంతో ఆయనను లక్కీ లెగ్ గా భావిస్తోన్నారు అభిమానులు. రెండు జట్లు కూడా సరిగ్గా ఏడు వికెట్లనే కోల్పోవడం గమనార్హం.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications