Ind Vs SA: గంభీర్ చేసిన ఆ తప్పే టీమిండియా ఓటమికి కారణం.. మాజీల ఫైర్..!!
టీమిండియాను దక్షిణాఫ్రికా ఓడించింది. కాదు, టీమిండియా ఓడిపోయేలా ఆడింది. కొత్త ప్రయో గాలు ఓటమికి కారణమయ్యాయి. బలమైన ప్రత్యర్థితో ఆడుతున్న సమయంలో చేసిన అర్దం లేని ప్రయోగాలు ఓటమి తెచ్చి పెట్టాయి. భారీ స్కోరు లక్ష్యంతో దిగిన టీమిండియా కీలకమైన పవర్ ప్లే సమయంలో ప్రధాన బ్యాటర్ల స్థానాలను మార్చేసింది. గంభీర్ చేసిన ఈ ప్రయోగాలతోనే భారత్ ఓడిపోయిందని మాజీ క్రికెటర్లు.. ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రపంచ కప్ వేళ ఈ ప్రయోగాలతో ఏం చెప్పదలచుకున్నారని నిలదీస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అటు బ్యాటుతో, ఇటు బంతితో ప్లేయర్లు విఫలమయ్యారు. ఆదుకుంటారు అనుకున్న అర్ష్దీప్ సింగ్, బుమ్రా.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో.. సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేశారు. ఛేదనకు దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. తిలక్ వర్మ(62) మినహా ఏ ఇతర బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో ప్రదర్శించలేదు. ఆఖరిలో 5 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలి వన్డేలో భారీ విజయం సాధించిన టీమిండియా ఈ రెండో టీ20లో స్వయం తప్పిదాలతో ఓటమి చవి చూపింది. ఈ ఓటమి పై మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, డేల్ స్టెయిన్ తీవ్రంగా స్పందించారు. హెడ్ కోచ్ గంభీర్ నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు.

భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు అత్యుత్తమ బ్యాటర్లు క్రీజులో ఉండాలి. అక్షర్ పటేల్ను వన్ డౌన్లో పంపించారు. దూకుడుగా ఆడాల్సిన అక్షర్.. 21 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అది అస్సలు సరైన పద్ధతి కాదు. టాప్ 3 బ్యాటర్ల స్థానాలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. బ్యాటింగ్ ఆర్డర్పై ప్రయోగాలు చేయడం వల్ల జట్టు స్థిరత్వం దెబ్బ తింటుందని అని రాబిన్ ఉతప్ప విశ్లేషించాడు. కాగా, 'సూర్య కుమార్ మీ బెస్ట్ బ్యాటర్. అతడిని వెనక్కి నెట్టి అక్షర్ను మూడో స్థానంలో పంపడమే గంభీర్ చేసిన పెద్ద తప్పు. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడానికి సమయం కాదు.
అక్షర్ పటేల్కు ఆడే సామర్థ్యం లేదని కాదు కానీ జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో వన్ డౌన్లో పంపడం సరికాదు. సింహాల గూటిలో అక్షర్ను నెట్టినట్టు అనిపించింది. సిరీస్లో ఆధిక్యం ప్రదర్శించే అవకాశం ఉన్న మ్యాచులో ఇలాంటి ప్రయోగాలు అనవసరం' అని డేల్ స్టెయిన్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి, గంభీర్ తన 'ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ ఆర్డర్' సిద్ధాంతంపై పునరాలోచన చేయాలని మాజీలు సూచిస్తున్నారు. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో తర్వాతి మ్యాచ్లపై ఆసక్తి నెలకొంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications