వరల్డ్ కప్ ఫైనల్ నేడే..మ్యాచ్ రద్దు అయితే కప్ ఆ జట్టుదే..!
మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన టైటిల్ పోరుకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం సిద్ధమైంది! నేడు (నవంబర్ 2, ఆదివారం) జరిగే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో ఆతిథ్య భారత మహిళల జట్టుతో, తొలిసారి ఫైనల్కు చేరిన సౌతాఫ్రికా మహిళల జట్టు తలపడనుంది. ఈ రెండు జట్లలో విజేత ఎవరైనా, ప్రపంచ క్రికెట్కు ఒక కొత్త ఛాంపియన్ దక్కడం ఖాయం.
అయితే, ఈ చారిత్రక మ్యాచ్పై ఇప్పుడు వర్షం ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్రకు ఎల్లో అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో, వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నేటి మ్యాచ్ రోజున ముఖ్యంగా సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జెమీమా రోడ్రిగ్స్ అద్భుత ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్, ఈ టోర్నీలో ఫామ్లో ఉన్న సౌతాఫ్రికా మధ్య జరిగే ఈ పోరు వర్షం కారణంగా నిలిచిపోతుందేమోనని అభిమానులు భయపడుతున్నారు.

వర్షం కారణంగా ఆదివారం ఆట సాధ్యం కాకపోతే, సోమవారం (నవంబర్ 3) రిజర్వ్ డే ఉంది. ప్రధాన లక్ష్యం 50 ఓవర్ల మ్యాచ్ను పూర్తి చేయడమే. రిజర్వ్ డే రోజున కూడా వర్షం వల్ల మ్యాచ్ను కనీసం ఓవర్ల కోతతో కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడితే, అప్పుడు ఐసీసీ నియమావళి అమలవుతుంది. నిబంధనల ప్రకారం, రెండు జట్లను 'ఉమ్మడి విజేతలు'గా ప్రకటిస్తారు.
ఈ అద్భుతమైన ఫైనల్ మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా జరగాలని, కొత్త ఛాంపియన్ను చూసే అవకాశం దక్కాలని క్రికెట్ ప్రేమికులంతా కోరుకుంటున్నారు. భారత్ తొలిసారి ప్రపంచ కప్ గెలవాలనే కోరిక కోట్ల మంది అభిమానులది.












Click it and Unblock the Notifications