టీమిండియాలో భారీ మార్పులు: అదే ఆందోళన
IND vs AFG 3rd T20: భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ కోసం సర్వ సిద్ధమైంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. వైట్ వాష్పై కన్నేసింది టీమిండియా. ఈ మ్యాచ్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది.
మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను ఇప్పటికే 2-0 తేడాతో ఆధిక్యతలో సొంతం చేసుకుంది టీమిండియా. తొలి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో పఠాన్లను మట్టికరిపించింది. అదే దూకుడును రెండో మ్యాచ్లో కొనసాగించింది. నాలుగు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయాన్ని సాధించింది.

మూడో మ్యాచ్లో కూడా విజయకేతనాన్ని ఎగురవేసి 3-0 తేడాతో ఈ సిరీస్కు ముగింపు పలకాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా నెట్స్లో శ్రమిస్తోన్నారు ప్లేయర్లు. అయిదు సంవత్సరాల్లో స్వదేశంలో జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్ ద్వైపాక్షిక సిరీస్ను ఎప్పుడూ కోల్పోలేదు భారత్.
ఈ అయిదేళ్లల్లో జరిగిన 13 మ్యాచ్లల్లో విజయం సాధించింది. రెండు డ్రాగా ముగిశాయి. ఈ రికార్డును మెరుగుపర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సిరీస్ ఆల్రెడీ గెలిచిన నేపథ్యంలో తుదిజట్టులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, బౌలర్లు కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్లను తీసుకోవచ్చు.

సిరీస్ గెలిచిన మాటెలా ఉన్నప్పటికీ.. రోహిత్ శర్మ విఫలం కావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. తొలి రెండు మ్యాచ్లల్లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. పట్టుమని 10 బంతులు కూడా ఆడలేదు ఈ రెండు మ్యాచ్లల్లో కలిపి. తొలి మ్యాచ్లో రెండు బంతులను ఎదుర్కొని రనౌట్ అయ్యాడు. రెండో గేమ్లో గోల్డెన్ డక్ సాధించాడు. జట్టు వరుస విజయాలు సాధిస్తోన్నప్పటికీ.. రోహిత్ శర్మ ఫామ్ కలవరపరుస్తోంది.
తుదిజట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ/సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ /రవి బిష్ణోయ్/కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
-
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే!












Click it and Unblock the Notifications