IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!!
India Vs England t20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ చేరింది. రెండో సెమీ ఫైనల్స్ లో భాగంగా ఇంగ్లాండ్ తో తల పడనుంది. విండీస్ తో మ్యాచ్ లో హోరా హోరీ తలపడిన టీమిండియా... ఇప్పుడు సూపర్ -8 లో ఓటమి లేని ఇంగ్లాండ్ పైన పోరాటం చేయనుంది. ముంబాయి ఇందుకు వేదిక కానుంది. ఇదే సమయంలో ముంబాయి సెమీ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే.. ఈ రెండు జట్లలో ఫైనల్ చేరేదెవరు.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చగా మారింది.
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సెమీ ఫైనల్స్ కు టీమిండియా సమాయత్తం అవుతోంది. ఈ నెల 5వ తేదీన ముంబాయి లో ఇంగ్లాండ్ తో టీమిండియా రెండో సెమీ ఫైనల్ ఆడనుంది. 4న కోల్ కతా లో దక్షిణాఫ్రికా - న్యూజీలాండ్ మధ్య జరిగే తొలి సెమీఫైనలో గెలిచిన వారితో .. భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో గెలిచిన జట్టు 8న అహ్మదాబాద్ లో ఫైనల్ ఆడనుంది. అయితే, సెమీస్ కు చేరిన టీమిండియా పైన అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో సెమీ ఫైనల్స్ కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. గ్రూప్ దశ, సూపర్-8 దశల్లో మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చేవారు. కానీ సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్ కావడంతో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఐసీసీ ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే కేటాయించింది. మ్యాచ్ డేలో వర్షం కారణంగా పూర్తి కాలేకపోతే, రిజర్వ్ డేలో మిగిలిన ఆటను పూర్తి చేస్తారు. దీంతో.. రెండో రోజు ఫలితం రాకపోతే ఏం చేస్తారనేది కీలకంగా మారుతోంది.

రిజర్వే డే నాడూ మ్యాచ్ జరగకుంటే.. ఇంగ్లాండ్ కే ఛాన్స్
ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం తేల్చే విధానం పైన ఐసీసీ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి.ఐసీసీ నిబంధనల ప్రకారం, నాకౌట్ దశలో (సెమీఫైనల్ లేదా ఫైనల్) మ్యాచ్ ఫలితం రాకపోతే, సూపర్-8 దశలో అన్ని మ్యాచులు పూర్తయిన తరువాత సెమీస్ లో పోటీ పడిన రెండు జట్లలో మెరుగైన పొజీషన్ లో ఉన్న జట్టే ఫైనల్కు అర్హత సాధిస్తుంది. సూపర్-8లో గ్రూప్-2లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్-1 నుంచి భారత్ రెండో స్థానంలో సెమీఫైనల్కు చేరింది. దీంతో, వర్షం కారణంగా రిజర్వ్ డే సైతం మ్యాచ్ జరిగే అవకాశం లేక.. భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ పూర్తిగా రద్దయితే, ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుతుంది. భారత్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. దీంతో, వర్షం పడకూడదని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications