Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల నగారా మోగిన వేళ.. ఐపీఎల్ షిఫ్టింగ్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

IPL 2024: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఏడు దశల్లో..

లోక్‌సభ ఎన్నికలన్నీ ఏడు దశల్లో పూర్తవుతాయి. తొలి దశ- ఏప్రిల్ 19, రెండ విడత- ఏప్రిల్ 26, మూడో విడత- మే 7, నాలుగో విడత- మే 13, అయిదో విడత- మే 20, ఆరో విడత- మే 25, ఏడో విడత- జూన్ 1వ తేదీన ముగుస్తాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నాలుగో విడతలో అంటే మే 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది.

IPL 2024 will happen in India

ఐపీఎల్ కోలాహలం..

అదే సమయంలో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఆరంభం కానుంది. ఈ నెల 22వ తేదీన మొదలవుతుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది.

22న తొలి మ్యాచ్..

22వ తేదీన రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతోన్నాయి. చెన్నైలోని చెపాక్‌లో గల ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు అందరూ ఎదురు చూస్తోన్నారు.

భద్రత అవసరం..

దేశవ్యాప్తంగా అటు సార్వత్రిక ఎన్నికలు, ఇటు ఐపీఎల్ 2024 ఒకేసారి కలిసి వచ్చిన నేపథ్యంలో- టోర్నమెంట్ నిర్వహణ కష్టం కావొచ్చని, ఎన్నికల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ, అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి భారీగా భద్రత సిబ్బందిని ఉపయోగించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

IPL 2024 will happen in India

కత్తి మీద సామే..

అటు ఎన్నికల సందడి, ఇటు ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల నిర్వహణ అనేది కత్తి మీద సాములాంటిదే. ప్రతి స్టేడియం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు, భద్రత సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. ఆటగాళ్లకూ అదే స్థాయిలో భద్రతను కల్పించాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల విధి నిర్వహణల్లో ఉండే పోలీసు, భద్రత సిబ్బందికి ఇది కొంత ఆటంకంగా కలిగించవచ్చని, అందుకే- ఈ టోర్నమెంట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలిస్తారనే ప్రచారం సాగింది.

బీసీసీఐ స్పష్టం..

వాటన్నింటికీ బీసీసీఐ తెర దించింది. టోర్నమెంట్‌ను తరలించట్లేదని తెలిపింది. మ్యాచ్‌లన్నీ కూడా షెడ్యూల్ ప్రకారమే స్వదేశంలోనే జరుగుతాయని కార్యదర్శి జై షా తెలిపారు. తొలి దశ ఎన్నికలు ఆరంభం కావడానికి చాలా సమయం ఉన్నందున ఈ లోగా సగం టోర్నమెంట్ ముగుస్తుందని వ్యాఖ్యానించారు.

పూర్తిస్థాయి షెడ్యూల్..

మ్యాచ్‌ల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఇక ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయడంపై దృష్టి సారించింది. నిజానికి- ఇప్పటివరకూ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వెలువడని విషయం తెలిసిందే. ఏప్రిల్ 7వ తేదీ వరకు మాత్రమే మ్యాచ్‌లను షెడ్యూల్ చేసింది బీసీసీఐ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+