కావ్య పాప అందుకే అతన్ని వదలడం లేదా..!
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ను ఆడుతోంది. తొలి టీ-20 మ్యాచ్ బుధవారం రాత్రి కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయి 132 పరుగులకు కుప్పకూలింది.
అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు అభిషేక్. కేవలం 34 బంతులలోనే 79 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. క్రీజ్ లోకి వచ్చిన సమయం నుండే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత దూకుడుగా ఆడి 34 బంతులలోనే 79 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అభిషేక్ దెబ్బకు 12.5 ఓవర్లలోనే మ్యాచ్ పూర్తైంది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మరోసారి వార్తలో నిలిచారు. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్రైజర్స్ టీం తరుఫున ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ అభిషేక్ శర్మను మాత్రం టీంలోనే కొనసాగిస్తోంది.
అభిషేక్ శర్మలో టాలెంట్ను ముందే గ్రహించిన కావ్య మారన్ అందుకే అతన్ని జట్టులో కొనసాగిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. డేవిడ్ వార్నర్ , భువనేశ్వర్, కేన్ విలియమ్సన్, వంటి ప్లేయర్లను జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ ,అభిషేక్ శర్మను మాత్రం చాలా ఏళ్లుగా జట్టులో కొనసాగిస్తూ వస్తోంది. గత ఐపీఎల్లో అభిషేక్ శర్మ సత్తా చాటాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ-20 సిరీస్ మొదటి మ్యాచ్లో అర్థ సెంచరీతో రాణించాడు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications