అదరగొడుతున్న కోహ్లీ.. ఫైనల్ దిశగా టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ - 2025లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కింగ్ కోహ్లీలో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో కోహ్లీ మరోసారి ఆకట్టుకున్నాడు. దాయాదుల పోరులో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ, కీలకమైన సెమీస్లో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 54 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. రోహిత్ శర్మ,శుభ్మన్ గిల్ వికెట్లను టీమిండియా కోల్పోయింది.అర్థ సెంచరీ దగ్గరకు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 45 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

దీంతో టీమిండియా మూడు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీతో పాటు, అక్షర్ పటేల్ ఉన్నాడు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన 264 పరుగులకు అలౌట్ అయింది. స్మిత్ 73,అలెక్స్ క్యారీ 61,ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్లు కూడా రాణించారు. వరుణ్, జడేజాలు చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇక అక్షర్, హార్దిక్ ఖాతాలో ఒక వికెట్ పడింది. ప్రస్తుతం భారత జట్టు 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ - 2025లో భాగంగా, తొలి సెమీ ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. రేపు(బుధవారం) రెండో ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications