కోచ్ సాబ్.. మీ నవ్వు కిల్లర్ కాంబినేషన్!
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసి భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అపురూప విజయంపై సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండని భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందిస్తూ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
గంభీర్ నవ్వుపై ధోనీ క్రేజీ కామెంట్
ఇన్స్టాగ్రామ్లో ధోనీ తనదైన శైలిలో స్పందిస్తూ.. "అహ్మదాబాద్లో చరిత్ర సృష్టించబడింది. భారత క్రికెట్ జట్టుకు, సపోర్ట్ స్టాఫ్కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు హృదయపూర్వక అభినందనలు. మీ ఆటను చూడటం చాలా ఆనందంగా ఉంది. 'కోచ్ సాబ్'.. మీ ముఖంపై నవ్వు చాలా బాగుంది. తీవ్రత, చిరునవ్వు.. ఈ రెండింటి కలయిక కిల్లర్ కాంబినేషన్! చాలా బాగా చేశారు, ఎంజాయ్ చేయండి గైస్!" అని పేర్కొన్నారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా గురించి రాస్తూ, "బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అతను ఒక ఛాంపియన్ బౌలర్" అని కొనియాడారు.

విమర్శలకు గంభీర్ ఘాటు సమాధానం
ధోనీ ప్రశంసల మధ్య, కోచ్ గౌతమ్ గంభీర్ విజయం అనంతరం మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో జరిగే అనవసర చర్చలపై స్పందిస్తూ.. "సోషల్ మీడియాలో విమర్శించే వారి పట్ల నాకు ఎటువంటి జవాబుదారీతనం లేదు. నా బాధ్యత అంతా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ఆ 30 మంది ఆటగాళ్లు, సిబ్బంది పట్ల మాత్రమే. ఒక కోచ్ తన జట్టు ఎంత బాగుంటే అంత గొప్పగా ఉంటాడు. నన్ను ఒక కోచ్గా తీర్చిదిద్దినది ఈ ఆటగాళ్లే" అని గంభీర్ తేల్చి చెప్పారు.
MS DHONI's INSTAGRAM POST FOR TEAM INDIA 🥹🇮🇳 pic.twitter.com/CDgZeHURXf
— Johns. (@CricCrazyJohns) March 8, 2026
దిగ్గజాలకు అంకితం
ఈ విజయం తనదని చెప్పుకోకుండా భారత క్రికెట్ భవిష్యత్తు కోసం పనిచేసిన వారిని గంభీర్ గుర్తుచేసుకున్నారు. "ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నాను. జట్టును ఒక స్థాయికి తీసుకెళ్లినందుకు రాహుల్ భాయ్కి, ఎన్సీఏ (CoE) ద్వారా బలమైన బెంచ్ స్ట్రెంత్ను సిద్ధం చేసినందుకు లక్ష్మణ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని ఆయన పేర్కొన్నారు. అలాగే, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఐసీసీ ఛైర్మన్ జై షాకు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు కూడా గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications